వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజుకు సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మూడు గంటల సుదీర్ఘ వాదనల అనంతరం సుప్రీం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని జ్యూడీషియల్ కస్టడీగా భావించాలని కూడా స్పష్టం చేసింది. వైద్య పరీక్షలను వీడియో తీసి.. రిపోర్టును సీల్డ్ కవర్ లో అందించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
వైద్య పరీక్షల పర్యవేక్షణకు జ్యూడీషియల్ అధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈమేరకు ఏపీ సీఎస్, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో మంగళగిరి ఎయిమ్స్, మణిపాల్ ఆసుపత్రుల చర్చ వచ్చింది. ఏపీ, తెలంగాణలో ఆర్మీ ఆసుపత్రులు ఉన్నాయా అని ప్రశ్నించిన న్యాయవాదికి సికింద్రాబాద్ లో ఆర్మీ ఆసుపత్రి, విశాఖలో నావల్ బేస్ ఆసుపత్రి ఉన్నాయని చెప్పారు. దీంతో న్యాయమూర్తి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు. ఈ ఖర్చును రఘురామరాజే భరించాలని తెలిపింది.
857284 508579This really is genuinely interesting, Ill look at your other posts! 228702
896196 381503I genuinely prize your function , Fantastic post. 572266
467198 19836We stumbled over here coming from a different web page and thought I may well check points out. I like what I see so now im following you. Appear forward to exploring your web page but once again. 495735