ప్రముఖ సినీ నటుడు, రచయిత రావి కొండలరావు ఈరోజు హైదరాబాద్ లో కన్ను మూశారు. బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందారు. 62ఏళ్ల ఆయన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. తేనె మనసులు, దసరాబుల్లోడు, చంటబ్బాయి, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, పెళ్లి పుస్తకం, బృందావనం, భైరవద్వీపం, రాధా గోపాళం, కింగ్, వరుడు.. తోపాటు 600కు పైగా సినిమాల్లో నటించారు.
నటుడిగా, రచయితగా ఆయన తెలుగు సినిమాల్లో చెరగని ముద్ర వేశారు. రచయితగా పెళ్లి పుస్తకం, భైరవద్వీపం, బృందావనం.. వంటి సినిమాలకు మాటలు రాశారు. బాపు, రమణలకు రావికొండలరావు అత్యంత ఆత్మీయులు. సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో రమణ ఇంట్లోనే ఆయన ఉండేవారు. విజయ నాగిరెడ్డికి రావికొండలరావు అత్యంత నమ్మకస్థులు. వారు నిర్మించిన బృందావనం, భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం సినిమాలు రావికొండలరావు నిర్మాణ నిర్వహణలోనే పూర్తి చేయడం విశేషం.
రావి కొండలరావు 1932 ఫిబ్రవరి 11న జన్మించారు. 1958లో వచ్చిన ‘శోభ’ సినిమాతో తెరంగేట్రం చేశారు. మద్రాసులో ఆనందవాణి పత్రికలో ఉప సంపాదకుడిగా పని చేసేవారు. మళయాళ, తమిళ సినిమాల్లో డబ్బింగ్ చెప్పేవారు. అక్కడే డబ్బింగ్ చెప్తున్న రాధా కుమారిని వివాహం చేసుకున్నారు. అలనాటి సినిమా విశేషాల్ని వివరిస్తూ ఆయన రచించిన బ్లాక్ అండ్ వైట్ పుస్తకం 2004లో ఉత్తమ పుస్తకంగా నంది అవార్డు గెలుచుకుంది. రావి కొండలరావు భార్య రాధాబాయి 2012లో మృతి చెందారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న రావి కొండలరావు మృతి సినీ రంగానికి తీరని లోటు.
209090 193902Exceptional post nonetheless , I was wanting to know in the event you could write a litte much more on this topic? Id be extremely thankful if you could elaborate a little bit much more. Thanks! 613421
32545 234148hey there i stumbled upon your website searching around the internet. I wanted to tell you I enjoy the appear of items around here. Maintain it up will bookmark for positive. 513063