టోక్యో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ లో తెలుగు తేజం, స్టార్ షట్లర్ పి.వి సింధు క్వార్టర్స్ లో విజయం సాధించి సెమీస్ లోకి దూసుకెళ్లింది. క్వార్టర్స్ లో జపాన్ క్రీడాకారిణి యమగుచి పై 21-13, 22-20తో అద్భుత విజయం సాధించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఆమె సాధించిన విజయం.. చూపిన పోరాట పటిమతో మరోసారి భారత్కు పతకం ఖాయం చేసేలా కన్పిస్తోంది.
సింధు, యమగూచి మధ్య 56 నిమిషాల పాటు ఉత్కంఠభరిత పోరు సాగింది. తొలి గేమ్ ఆరంభంలో తడబడి ఆ తర్వాత మ్యాచ్ను తనవైపు తిప్పుకుంది. తొలి గేమ్ విరామానికి 11-7తో స్పష్టమైన ఆధిక్యం సంపాదించింది. మొత్తంగా 21-13తో తొలి గేమ్ను దక్కించుకున్న సిందుకు.. రెండో గేమ్లో యమగూచి నుంచి గట్టి పోటీ ఎదురయింది. ఓదశలో 15-14తో సింధు పైచేయి సాధించిన యమగుచి ఆధిక్యంలో నిలిచింది. అయితే.. సింధు ఎదురుదాడి కొనసాగించడంతో ఇద్దరూ 20-20 పాయింట్లతో సమంగా నిలిచారు.
అయితే.. చివర్లో సింధు విజృంభించి వరుసగా రెండు పాయింట్లు సాధించి 22-20తో రెండో గేమ్ గెలించింది. దీంతో సింధు సెమీస్కు దూసుకెళ్లింది. మరో క్వార్టర్స్లో థాయ్లాండ్ కు చెందిన ఇథనాన్, చైనీస్ తైపీకి చెందిన తై జు యింగ్ తలపడనున్నారు. ఇందులో గెలిచిన వారితో సింధు సెమీస్లో పోటీ పడనుంది.
162574 355471I tried to submit a comment earlier, although it has not shown up. I will remember this. 614045
308901 69524This is a superb blog, would you be involved in performing an interview about just how you developed it? If so e-mail me! 603460