రాజధాని అమరావతి పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి భవిష్యత్తులో ఏమవబోతోంది.? తాజా పరిణామాల్ని బట్టి చూస్తోంటే, రాజధాని అమరావతి పరిధిలో మాత్రమే కాదు, మొత్తంగా కృష్ణా జిల్లాతోపాటు గుంటూరు జిల్లాలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముందు ముందు అత్యంత దయనీయంగా తయారవబోతోందనిపించడం ఖాయం.
రాజధాని అమరావతిని తరలించే దిశగా వైసీపీ ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్న విషయాన్ని సాక్షాత్తూ మంత్రి బొత్స సత్యనారాయణే స్పష్టం చేశారాయె. దానిపై వైసీపీకి చెందిన ఇతర ముఖ్య నేతలు ఎంతలా కవరింగ్ ఇచ్చుకుంటున్నా ఉపయోగం లేకుండా పోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈపాటికే మంత్రి బొత్స వ్యాఖ్యలపై స్పందించి వుండాలి. కానీ, జగన్ ఆ పని చేయడంలేదు.
మరోపక్క రాజధాని ప్రాంతంలో వైసీపీకి వ్యతిరేకంగా నిరసన సెగలు జోరందుకున్నాయి. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, జగన్ సర్కార్కి వ్యతిరేకంగా నినదిస్తున్నారు. ఈ రోజు రాస్తా రోకో చేపట్టిన రాజధాని ప్రాంత రైతులు, ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని చెబుతున్నారు.
కాగా, తెలుగుదేశం పార్టీతోపాటు, బీజేపీ, జనసేన, వామపక్షాలు కూడా రాజధాని ప్రాంత రైతులకు మద్దతుగా వుంటామంటున్నాయి. మరీ ముఖ్యంగా జనసేన అధినేత పవన్, రాజధాని ప్రాంతంలో పర్యటనకు ప్లాన్ చేశారు. రైతులకు అండగా వుంటామని ఇప్పటికే ప్రకిటంచిన పవన్, రాజధాని ప్రాంతంలో రైతుల తరఫున దీక్ష చేపట్టే ఆలోచనలో కూడా వున్నట్లు తెలుస్తోంది.
అదే గనుక జరిగితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిప్పలు తప్పవు. తాజా పరిస్థితుల నేపథ్యంలో వైసీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు అలర్ట్ అవుతున్నారు. తాము సైతం రాజధాని తరలింపుకి వ్యతిరేకమనీ, మంత్రి బొత్స వ్యాఖ్యల్ని సహించబోమనీ, అధినేత వైఎస్ జగన్కి తాజా పరిణామాల్ని తెలియజేస్తామనీ చెబుతున్నారు. చిత్రంగా రాజధాని రైతులు చేపట్టిన ఆందోళనలో వైసీపీ జెండాలు కూడా కన్పించాయండోయ్.
382387 928037Hello! I simply would like to give a huge thumbs up for the great information youve here on this post. I may possibly be coming back to your weblog for far more soon. 537265
289196 213446Ich kenne einige Leute, die aus Kanadakommen. Eines Tages werde ich auch dorthin reisen Lg Daniela 436832