కరోనా మహమ్మారి చేస్తున్న విలయం అంతా ఇంతా కాదు. దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మృతి చెందిన వారి కుటుంబాల బాధ వర్ణనాతీతం. హైదరాబాద్ లో ఒకే కుటుంబంలోని ముగ్గరు కరోనా మహమ్మారికి బలైపోయారు. అయితే వీరు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. వారికి చెల్లించాల్సిన బిల్లు విషయమై ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది.
నగరానికి చెందిన సత్యనారాయణరెడ్డి కరోనా వైరస్ బారిన పడ్డారు. సోమాజీగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిల చికిత్స తీసుకుంటూ బుధవారం మృతి చెందారు. ఈయన కుమారుడికి కూడా కరోనా సోకి ఇదే ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. సత్యనారాయణ రెడ్డి భార్య సుహాసిని కూడా కరోనా బారిన పడి ఇక్కడే చికిత్స తీసుకున్నారు. ఆమె కోలుకుని ఇంటికెళ్లారు. కానీ శ్వాసకోస సంబంధ వ్యాధితో మళ్లీ ఈనెల 28న ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. సత్యనారాయణ రెడ్డి ఆరోగ్యం దృష్ట్యా సుహాసిని మరణవార్తను భర్తకు చెప్పలేదు. ఇప్పుడు సత్యనారాయణ రెడ్డి కూడా మృతి చెందారు.
అయితే.. వీరి చికిత్సకు ప్రతిరోజూ ఉదయం 60వేలు చెల్లించాలని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆ ప్రకారం ఇప్పటికి 8లక్షలు చెల్లించారు. ఇంకా పెండింగ్ 10లక్షలు కట్టాలని ఆస్పత్రి వర్గాలు డిమాండ్ చేస్తున్నాయని కుటుంబసభ్యులు ఆవేదన చెందున్నారు. లేకపోతే సత్యనారాయణ రెడ్డి మృతదేహం ఇచ్చేది లేదంటున్నారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
205293 557442As soon as I discovered this internet web site I went on reddit to share some with the enjoy with them. 430339
411447 533230I always was concerned in this subject and stock nonetheless am, regards for posting . 415874
16576 207274Currently it seems like BlogEngine could be the best blogging platform out there right now. (from what Ive read) Is that what you are utilizing on your weblog? 122440
545293 880710Enjoyed examining this, quite great stuff, thanks . 142445
190842 711904Hey there! Excellent post! Please when I will see a follow up! 793868