యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహూ చిత్రం తాజా షెడ్యూల్ ని ముంబైలో ఈ రోజు ఉదయం మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్ లో పాల్గొనేందుకు ప్రభాస్ ముంబై కి నిన్న సాయంత్రం చేరుకున్నాడు. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ భారీ చిత్రం ఇప్పటికే ఎనభై శతం పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ముంబై లో జరిగే షెడ్యూల్ తరువాత చివరి షెడ్యూల్ ని హైదరాబాద్ లో జరపనున్నారు. దాంతో ఈ సినిమా టాకి పార్ట్ మొత్తం పూర్తవుతుంది.
మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జోరుగా జరుగుతున్నాయి. త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టు 15న చిత్రాన్ని విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. బాలీవూడ్ భామ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏకంగా 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలతో పాటు మరికొన్ని భాషల్లో విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ సినిమాతో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తున్న జాన్ సినిమా పారిస్ లో ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేసుకోవడంతో ఆ సినిమాకు బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ సాహో షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. జిల్ ఫెమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా దీపావళికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి రెండు సినిమాలతో తన ఫాన్స్ ని ఖుషి చేయడానికి వస్తున్న ప్రభాస్ .. మరోవైపు ఈ ఏడాది పెళ్ళికి కూడా సిద్ధం అవుతున్నట్టు తెలిసింది. బాహుబలి తో ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ కు అటు బాలీవుడ్ లో కూడా సినిమా అవకాశాలు వస్తున్నాయి.
