ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న ఎవరు మీలో కోటీశ్వరులు షో ఆగస్ట్ 2021 నుండి ప్రసారమవుతోన్న విషయం తెల్సిందే. ఈ షో కు మొదట్లో సూపర్బ్ రెస్పాన్స్ వచ్చినా తర్వాత తగ్గిపోతూ వస్తోంది. ఎన్టీఆర్ ఈ షో షూటింగ్ ను పూర్తి చేసాడు. ఇంకా కొన్ని రోజులు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ షో కు వచ్చిన రాజా రవీంద్ర అనే యువకుడు ఈ కార్యక్రమంలో హయ్యస్ట్ అమౌంట్ కోటి రూపాయలను గెలుచుకున్నాడు. తెలుగు టెలివిజన్ చరిత్రలో కోటి గెలుచుకున్న మొదటి వ్యక్తిగా నిలిచాడు. తెలంగాణలోని కొత్తగూడెం నుండి వచ్చాడు రాజా రవీంద్ర. పోలీస్ టోర్నమెంట్స్ లో గన్ షూటింగ్ లో నేషనల్ లెవెల్ ప్లేయర్ అయిన రవీంద్ర సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు.
ఒలింపిక్స్ లో భారత్ కు ప్రాతినిథ్యం వహించాలన్నది తన కల అని చెప్పిన రవీంద్ర వచ్చిన డబ్బుని దానికోసం ఉపయోగిస్తానని తెలిపాడు.
106009 743872Simply wanna input on couple of common issues, The website layout is perfect, the articles is really good : D. 71858
763735 582431Several thanks for the amazing post C Id enjoyable reading it! That i adore this blog. 425419