PM Modi: దేశంలోనే తొలిసారి నిర్మించిన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ (Under water metro rail) మార్గాన్ని ప్రధాని మోదీ (PM Modi) నేడు కోల్ కతా (Kolkata) లో ప్రారంభించారు. ఈ సందర్భంగా రైలులో విద్యార్ధులతో కలిసి నీటి అడుగున ఎస్ ప్లనేడ్ నుంచి హావ్ డా మైదాన్ స్టేషన్ల మధ్య ప్రయాణించారు.
ప్రయాణం సందర్భంగా మెట్రో సిబ్బందితో మోడీ ముచ్చటించారు. అండర్ వాటర్ టన్నెల్.. రైలు విశేషాలను ప్రధానికి మెట్రో అధికారులు వివరించారు. కోల్ కతా ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్ కింద రూ.120కోట్లతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది కింద నిర్మించారు. మొత్తం మెట్రో మార్గం పొడవు 16.6కి.మీ కాగా.. 10.8కి.మీ భూగర్భంలోనే ఉంటుంది. ఎస్ ప్లెనెడ్ నుంచి హవ్ డా మైదాన్ వరకూ 4.8కిమీ పరిధిలో 520 మీటర్ల పొడవైన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ నిర్మించారు.
దేశంలో తొలి మెట్రో సేవలు కూడా 1984లో అప్పటి కలకత్తాలోనే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అండర్ వాటర్ టన్నెల్ కూడా కోల్ కతాలోనే తొలిగా ప్రారంభమవడం విశేషం.
#WestBengal: PM @narendramodi interacts with school students as he travels with them in India’s first underwater metro train in #Kolkata. @metrorailwaykol @RailMinIndia pic.twitter.com/75rA3fVb0x
— DD News (@DDNewslive) March 6, 2024