దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజలపై పెను భారం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాని మోదీ తొలిసారి స్పందించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న సందర్భంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్సులో మాట్లాడుతూ..
‘ఇంధన ధరలపై కేంద్రం పన్నులు తగ్గిస్తున్నా.. రాష్ట్రాలు తగ్గించకపోవడం సహేతుకం కాదు. గతేడాది నవంబర్ లో కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించింది. రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలని కోరాం. తగ్గించకపోవడంపై నేనెవరినీ విమర్శించను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాలు తగ్గించలేదు. ఇప్పటికైనా రాష్ట్రాలు పన్నులు తగ్గించాలి’ అని అన్నారు.
కోవిడ్ పరిస్థితులపై మాట్లాడుతూ.. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలి. మాస్క్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా ప్రజల్లో అవగాహన పెంచాలి. టెస్ట్, ట్రాకింగ్, ట్రీట్మెంట్ విధానాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలి. ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని పెంచాలి. ఆక్సిజన్ అందుబాటులో ఉంచుకోవాలి’ అని అన్నారు.
99309 465483I real glad to discover this web site on bing, just what I was searching for : D likewise saved to bookmarks . 103340