సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ పీజీ విద్యార్ధిని ప్రీతినిమ్స్ లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడినా ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో రాత్రి 9.10గంలకు ఆమె మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.
కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ మొదటి ఏడాది చదువుతున్న ప్రీతిని కొన్నాళ్లుగా సీనియర్ విద్యార్ధి సైఫ్ వేధిస్తున్నాడు. దీంతో ఆమె హానికరమైన ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో మొదట వరంగల్ ఎంజీఎం అనంతరం మెరుగైన వైద్యం కోసం నిమ్స్ కు తరలించారు. నిపుణులైన వైద్య బృందం ప్రయత్నాలు ఫలించలేదు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్ధి, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి.
సైఫ్ ను శిక్షించాలని స్వగ్రామం జనగామ జిల్లా కొడకొండ్ల గిర్నితండాలో గ్రామస్థులు ఆందోళన చేశారు. ప్రీతి మృతిపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. ఆమె కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమె కుటుంబానికి అండగా ఉంటుందని అన్నారు.
239030 957181This web-site can be a walk-through rather than the info you wished about it and didnt know who must. Glimpse here, and you will certainly discover it. 25084