కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో భార్యా బాధితులు ఆందోళన చేపట్టారు. స్థానిక ఫ్రీడం పార్కులో సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ తో కలిసి ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా పలు డిమాండ్లు చేశారు. భార్య, అత్తింటి వేధింపులను తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గృహ హింస చట్టం దుర్వినియోగం అవుతోందని అన్నారు. దీక్షలో భాగంగా తమ డిమాండ్లను నినదించారు.
‘గృహ హింస చట్టంలో ఉన్న లొసుగులను కొందరు భార్యలు విదేశాల్లో ఉంటున్న భర్త తరపు కుటుంబసభ్యులను వేధిస్తున్నారు. తప్పుడు కేసులతో వేధించిన మహిళలను శిక్షించాలి. వృద్ధులైన అత్తమామలపై కోడళ్లు పెట్టిన కేసులు రద్దు చేయాలి. ఎన్ఆర్ఐలకు సంబంధించిన కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలి’.
‘విడాకులు తీసుకుంటే వారి సంతానం ఇద్దరి వద్దా ఉండేలా చట్టంలో సవరణలు చేయాలి. విడాకులు తీసుకున్న భార్య ధనవంతులైతే ఆమెకు భరణమిచ్చే విధానం రద్దు చేయాలి’ అని నినదించారు. ఈరోజు ఉదయం ప్రారంభించిన దీక్ష సాయంత్రం వరకూ కొనసాగించారు.
233638 531551I like this internet web site because so significantly utile stuff on here : D. 396841
139713 817989This really is the sort of data Ive long been in search of. Thanks for posting this details. 284951
112992 859922I actually enjoyed reading this website, this is great blog. 200233