పెగాసస్.! ప్రపంచాన్ని కుదిపేసింది కొన్నాళ్ళ క్రితం. ఆ పైత్యం మన దేశంలోనూ ‘వ్యక్తిగత సమాచారం దోపిడీకి గురైంది’ అన్న కోణంలో రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్న సంగతి తెలిసిందే.
ఇంతకీ, కేంద్ర ప్రభుత్వం పెగాసస్ వాడిందా.? లేదా.? వాడిందనీ చెప్పలేదు, వాడలేదనీ చెప్పలేదు. పార్లమెంటును కుదిపేసిన ఈ అంశం అనూహ్యంగా చల్లారిపోయింది. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఓ హౌస్ కమిటీ వేసింది. ఆ హౌస్ కమిటీ, పెగాసస్ సహా, ఫోన్ ట్యాపింగ్ అంశంపైనా ఆరా తీస్తోంది.
ఇంతకీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హౌస్ కమిటీ ఏం తేల్చబోతోంది.? 2016 నుంచి 2019 మధ్య మహా కుట్ర జరిగిందన్నది హౌస్ కమిటీ సభ్యుడు, వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుండ బద్దలుగొట్టి మరీ చెబుతున్నమాట.
పెగాసస్ స్పై వేర్ తయారు చేసింది భారతదేశంలో కాదు. ఇజ్రాయెల్లో తయారు చేశారు. దాన్ని ఎవరైనా సొమ్ములు చెల్లించి కొనుక్కోవాల్సిందే. అది కూడా ప్రభుత్వాలకు తప్ప, ప్రైవేటు వ్యక్తులకు అమ్మరు. ప్రభుత్వాలు కొనుగోలు చేస్తే, వాటి కోసం ఎంత సొమ్ము వెచ్చించిందీ లెక్కలు అధికారికంగానే వుంటాయ్.
మరి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు హయాంలో పెగాసస్ కొనుగోలు చేస్తే, దానికి సంబంధించిన లెక్కలుండాలి కదా.? అసలంటూ స్పై వేర్ కొనుగోలు చేయనప్పుడు, పెగాసస్ కుంభకోణం జరిగిందని ఎలా అంటాం.? అన్నది గతంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంధించిన ప్రశ్న. టీడీపీది కూడా ఇదే వాదన. నిజానికి, సామాన్యులకూ ఇదే డౌట్ వస్తోంది.
అమరావతి కుంభకోణమన్నారు.. కొండను తవ్వారు, ఎలుకని కూడా పట్టలేకపోయారు. అదేదో ఈఎస్ఐ మెడికల్ పరికరాల స్కామ్ అన్నారు.. అక్కడా ఏమీ తేలలేదు. మొన్నటికి మొన్న పదో తరగతి ప్రశ్నా పత్రాల లీక్ అన్నారు.. అందులోనూ ఏమీ తేలినట్టు కనిపించడంలేదు.
ఇప్పుడీ హౌస్ కమిటీ ఏం తేల్చబోతోంది.? చంద్రబాబుని దోషిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హౌస్ కమిటీ తేల్చితే, ఆ తర్వాత ఏం జరుగుతుంది.? ఏమో, వేచి చూడాల్సిందే.
842678 603332It was any exhilaration discovering your internet site yesterday. I arrived here nowadays hunting new items. I was not necessarily frustrated. Your concepts after new approaches on this thing have been helpful plus an superb assistance to personally. We appreciate you leaving out time to write out these items and then for revealing your thoughts. 905460