ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మంచి కోరి పరిపాలన చేస్తున్నట్లు ఏ కోశానా కనిపించడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇటివల కర్నూలులో చెత్త పన్ను కట్టలేదని దుకాణాల ముందు చెత్త పోయడం.. కాకినాడలో చెత్త పన్ను కట్టకపోతే ఇంట్లో సామాన్లు జప్తు చేస్తామని ఫ్లెక్సిలు కట్టి వాహనాలపై ప్రచారం చేయడంపై ఆయన విమర్శలు చేశారు. తీవ్ర వివాదాస్పదమయిన ఈ అంశాలపై పవన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
‘పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతామని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ట్రాక్టర్లు వేసుకొని తిరగడం ఏం సూచిస్తోంది? డెయిలీ ఫైనాన్స్ వ్యాపారం చేసుకొనేవాళ్ళ ఆలోచనలా ఉంది. ప్రజలు గౌరవప్రదంగా జీవించడం ఈ ప్రభుత్వానికి నచ్చదు. చెత్త పన్ను విధింపే ఒక దరిద్రం అనుకొంటే వసూలు చేస్తున్న విధానం మరింత దిగజారుడుగా ఉంది. కర్నూలులో వ్యాపారులు ఆ పన్ను చెల్లించలేదని దుకాణాల ముందు, సిటీలోని చెత్తను తెచ్చి వేసి అవమానిస్తారా? ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే’ అని మండిపడ్డారు.
ప్రజల మంచి కోరి పరిపాలన చేస్తున్నట్లు ఏ కోశానా కనిపించడం లేదు. పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతామని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ట్రాక్టర్లు వేసుకొని తిరగడం ఏం సూచిస్తోంది? డెయిలీ ఫైనాన్స్ వ్యాపారం చేసుకొనేవాళ్ళ ఆలోచనలా ఉంది. pic.twitter.com/MIuGWaJeyN
— Pawan Kalyan (@PawanKalyan) March 18, 2022
131009 424792Some genuinely interesting info , nicely written and broadly speaking user pleasant. 412849
448764 32337Your writing taste has been surprised me. Thanks, quite great post. 965235