Switch to English

అమరావతి రైతులకు అండగా వుంటాం: జనసేనాని పవన్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు అండగా వుంటామని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. ‘రైతులు ప్రభుత్వాన్ని నమ్మి భూముల్ని ఇచ్చారు. ప్రభుత్వం అంటే ఓ పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు. ప్రభుత్వంలో వున్నవారు ఐదేళ్ళకోసారి మారొచ్చు.. అలా మారిన ప్రతిసారీ రాజధానులు మార్చుకుంటూ పోతామంటే ఎలా.? రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలి. అమరావతికి మద్దతుగా ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీ సాక్షిగా మద్దతు పలికిన వైఎస్‌ జగన్‌, అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నారు. మరిప్పుడు ఎందుకు రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నారు.?’ అని జనసేన అధినేత ప్రశ్నించారు.

పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్పరెన్స్‌ నిర్వహించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ‘ఈ సందర్భంగా అమరావతి అంశం అత్యంత కీలక ఎజెండాగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడూ రైతుల తరఫున మాట్లాడాం.. అప్పుడు టీడీపీ మనల్ని విమర్శించింది.. ఆ తర్వాతా అమరావతి రైతుల గురించి మాట్లాడుతున్నాం.. వైసీపీ మనల్ని విమర్శించింది.. వైసీపీ, టీడీపీ రెండూ ఒకటే ప్రజల్ని మోసం చేయడంలో. ప్రజా సమస్యల విషయంలో జనసేనకు మాత్రమే చిత్తశుద్ధి వుంది.. అందుకే, కష్టమొచ్చినప్పుడు జనసేన తలుపు తడుతున్నారు..’ అని జనసేన ముఖ్య నేతలు వ్యాఖ్యానించారు.

అమరావతి విషయంలో అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధంగా వుండాలని పార్టీ శ్రేణులకు జనసేన అధినేత పిలుపునిచ్చారు. మూడు రాజధానుల విషయమై న్యాయ కోవిదులతో చర్చించనున్నట్లు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. ‘రైతు కంటతడి పెడితే అది రాష్ట్రానికి మంచిది కాదు. మూడు రాజధానుల పేరుతో అటు ఉత్తరాంధ్రనీ, ఇటు రాయలసీమనీ మభ్యపెట్టొద్దు.. ఇది విభజన రాజకీయాలకు దారి తీస్తుంది..’ అంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

‘మేం టీడీపీకి అలాగే వైసీపీకి సమదూరం పాటిస్తున్నాం.. ప్రజల తరఫున ఈ రెండు పార్టీలతో రాజకీయ పోరాటం చేస్తున్నాం..’ అని జనసేన అధినేత పునరుద్ఘాటించారు. ‘ఎన్నికల్లో ఓట్ల కోసం అమరావతిని తరలించడంలేదని వైఎస్‌ జగన్‌ సహా వైఎస్సార్సీపీ నేతలంతా చెప్పారు.. ఇప్పుడు మూడు రాజధానులంటున్నారు.. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ప్రజా ప్రతినిథులు రాజీనామా చేయాలి.. వైసీపీతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలూ రాజీనామా చేయాలి..’ అని ఈ సందర్భంగా జనసేన పార్టీ డిమాండ్‌ చేసింది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...