Switch to English

మూడు రాజధానులు.. ముందున్న సవాళ్లు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్న వైఎస్సార్ సీపీ.. ఏపీ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయించుకుంది. ఆ బిల్లు చట్టరూపం కావడంతో దానికి సంబంధించిన ప్రక్రియను వడివడిగా మొదలుపెట్టేసింది. అయితే, ఇది అంత సులభమేనా? ప్రస్తుతం మూడు రాజధానుల అంశం కార్యరూపం దాల్చడానికి ఉన్న అడ్డంకులేమిటి? అంటే.. రాజ్యాంగపరంగా ఇది అంత సులభం కాదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని తరలింపునకు సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతోంది.

గతంలో విజిలెన్స్ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ ప్రభుత్వం తీసుకున్న్ నిర్ణయంపై స్టే విధించింది. అలాగే ఏపీ సీఆర్డీఏ రద్దుకు సంబంధించి ఆగస్టు 6న విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో హైకోర్టు జోక్యం పరిమితంగా ఉన్నప్పటికీ, అవి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే మాత్రం తప్పకుండా జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక శాసనమండలిలో ఆ బిల్లుల ఆమోదం విషయంలో వివాదం నెలకొంది. సెలెక్ట్ కమిటీకి బిల్లు పంపించామని, అక్కడ అది ఉండగానే ప్రభుత్వం మరోసారి మండలికి బిల్లు పంపించి అడ్డదారిలో ఆమోదం పొందేలా చేసిందని, అందువల్ల ఆ బిల్లు ఆమోదం పొందలేదని టీడీపీ వాదిస్తోంది. ప్రధానంగా ఇది ప్రభుత్వానికి అడ్డంకి అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరో ముఖ్యమైన అంశం.. కర్నూలును జ్యుడీషియల్ రాజధానిగా చేయడం. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదని అంటున్నారు. హైకోర్టును ఏర్పాటు చేయాలన్నా.. తరలించాలన్నా అందుకు సుప్రీంకోర్టు అనుమతి అవసరం. ఈ విషయాన్ని గవర్నర్ పరిగణనలోకి తీసుకోకుండా ఆమోదం తెలిపారని నిపుణులు చెబుతున్నారు. అమరావతిలో హైకోర్టు ఏర్పాటు రాష్ట్రపతి ఉత్తర్వులు ద్వారా జరిగిందని.. దానిని మార్చాలంటే సుప్రీంకోర్టు సూచన మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులతోనే సాధ్యమవుతుందని స్పష్టంచేస్తున్నారు.

మరోవైపు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కూడా ఇది సాధ్యం కాదనే వాదనను వినిపిస్తున్నారు. అందులో ఏపీకి కొత్త రాజధాని ఏర్పడేవరకు హైదరాబాద్ రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారని.. కానీ ఏపీకి కొత్త రాజధానులు అని ప్రస్తావించలేదని చెబుతున్నారు. అందువల్ల మూడు రాజధానులు అనేది ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి వ్యతిరేకమని అంటున్నారు. రాజధాని ఏర్పాటుకు ప్రత్యేకంగా చట్టం లేనప్పటకీ.. దేశం మొత్తానికి ఒకే రాజధాని ఉందనే సంగతిని ప్రస్తావిస్తున్నారు. దక్షిణాఫ్రికా మోడల్ గురించి చెబుతున్నా.. అది ఆ దేశం మొత్తానికి మూడు రాజధానులని, ఎక్కడ రాష్ట్రానికి మూడు రాజధానులు లేవని పేర్కొంటున్నారు. అలాగే అమరావతిలో రైతుల నుంచి తీసుకున్న భూమికి మూడింతలు పరిహారం చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇన్ని అడ్డంకుల మధ్య ఏపీ మూడు రాజధానులు కార్యరూపం దాలుస్తుందా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Ram Charan : చరణ్‌ బర్త్‌డేకి ముచ్చటగా మూడు…!

Ram Charan : మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 27న ఆయన ఫ్యాన్స్ తో...

వైనాట్ 175 అటకెక్కింది.! ఓన్లీ పిఠాపురం చుట్టూ వైసీపీ గింగరాలు తిరుగుతోంది.!

అదేంటీ, వైనాట్ 175 అన్నారు కదా.. ఇప్పుడేంటి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా వైసీపీ అంతా, పిఠాపురం నియోజకవర్గం చుట్టూనే తిరగడం.? ఔను, వైసీపీ అధినాయకత్వం పూర్తిగా పిఠాపురం మీదనే...

Hyderabad: ధీర వనితలు..! పోరాడి దొంగలను పోలీసులకు పట్టించారు

Hyderabad: నాటు పిస్తోలుతో బెదిరించిన ఇద్దరు దొంగలను.. తల్లీ, కుమార్తె ధైర్యంగా ఎదుర్కొన్న ఘటన హైదరాబాద్ (Hyderabad) లో జరిగింది. ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రసూల్ పురా జైన్...

Uppena : హిందీ ‘ఉప్పెన’ ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌

Uppena : మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన సినిమా ఉప్పెన. ఇదే సినిమా తో దర్శకుడిగా బుచ్చిబాబు మరియు హీరోయిన్‌ గా కృతి శెట్టి లు నటించిన...

కర్మ ఈజ్ బ్యాక్: గులాబీ పార్టీ గల్లంతే.!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త గట్టిగా తలచుకుంటే, తెలంగాణ నుంచి భారత్ రాష్ట్ర సమితి పూర్తిగా ఔట్ అయిపోతుంది. గులాబీ పార్టీలో కేసీయార్, ఆయన తనయుడు కేటీయార్, కుమార్తె కేటీయార్ మాత్రమే...