తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మిత్రపక్షం జనసేన మద్దతు కోరుతోంది. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఢిల్లీకి తీసుకెల్ళారు కిషన్ రెడ్డి. ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకత్వంతో జనసేన అధినేత చర్చలు జరిపారు.
‘ఇది తెలంగాణ ఎన్నికల నిమిత్తం జరుగుతున్న చర్చల వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల గురించి, అక్కడి బీజేపీ నాయకత్వం, తగిన విధంగా మిత్రపక్షం జనసేనతో సంప్రదింపులు జరుపుతుంది..’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టతనిచ్చారు కూడా.!
కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కిందా మీదా పడిపోతోంది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నేతలు అవాకులు చెవాకులు పేలడం ఎక్కువైపోయింది. జనసేన అధినేతను, బీజేపీ అధినాయకత్వం రప్పించుకుంటే, వైసీపీ ఎందుకు కంగారు పడాలి.?
వుంది.. బలమైన కారణమే వుంది.! తెలంగాణలో వైసీపీ జెండా ఏనాడో పీకేశారు. కానీ, జనసేనాని అలా కాదు. ఓడినా, తెలంగాణలోనూ జనసేన పార్టీని నడుపుతున్నారు. అదీ వైసీపీ కడుపు మంట. బీజేపీ డజనుకు పైగానే సీట్లను జనసేనకు ఆఫర్ చేసేలా వుంది. అదే జరిగితే, నాలుగైదు సీట్లలో జనసేన గెలుస్తుందన్నది అంతటా జరుగుతున్న చర్చ.
తెలంగాణలో గనుక జనసేన – బీజేపీ కాంబినేషన్ సక్సెస్ అయితే, ఆ ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మరింత స్ట్రాంగ్గా వుంటుంది. అది తెలిసే, జనసేనాని అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదిపారు. తెలంగాణలో టీడీపీ కూడా కొంత యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఆ టీడీపీతో జనసేన ప్రస్తుతం స్నేహం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
బీజేపీ – టీడీపీ – జనసేన.. ఈ కూటమికి దాదాపు రంగం సిద్ధమయినట్లే. ఈ కూటమికి కేంద్ర బిందువుగా జనసేన మారుతుండడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. అదే అసలు సమస్య.! కానీ, వైసీపీ ఎంత గింజుకున్నా, జరగాల్సింది జరగడం ఆగదు కదా.?