సినిమా టిక్కెట్ల ధరల విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో ‘భీమ్లానాయక్’ అభిమానులు గుస్సా అవుతున్నారు. ‘భీమ్లానాయక్’ అభిమానుల్లో మెజార్టీ పవన్ కళ్యాణ్ అభిమానులే కదా. ఆ పవన్ కళ్యాణ్ అభిమానులే మెజార్టీ జనసైనికులనుకోండి.. అది వేరే సంగతి.
‘బీమ్లానాయక్’ సినిమా విషయమై టిక్కెట్ల ధరల్ని తగ్గించేలా జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న ‘కక్ష పూరిత వైఖరి’ వల్ల, పవన్ అభిమానులు ఒకింత ఆందోళన చెందినా, తమను తాము సర్దిచెప్పుకుంటున్నారు.. కొత్తగా ఆలోచన చేస్తున్నారు.
సినిమా కోసం మామూలుగా అయితే రెండొందలో మూడొందలో ఖర్చు చేయాలి గనుక.. తక్కువ ధరకే సినిమా టిక్కెట్ లభిస్తే, మిగిలిన మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళం రూపంలో అందించేద్దామనే ప్రయత్నంలో వున్నారు. ఇప్పటికే ఈ దిశగా విరాళాల్ని జనసేనకు పంపిస్తూ, ఆ వివరాల్ని స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు.
గతంలో ‘వకీల్ సాబ్’ విషయంలోనూ ఇదే తరహాలో పవన్ అభిమానులు వ్యవహరించగా, ఈసారి పెద్దయెత్తున విరాళాల కార్యక్రమం జరుగుతోంది. ఈ ఆలోచన రావడానికి పవన్ కళ్యాణ్ సినిమాలపై ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీ వ్యవహరిస్తున్న కుట్రపూరిత వైఖరే కారణమని ఆరోపిస్తూనే, జనసేన పార్టీకి సాయం చేసే అవకాశం ఈ రకంగా కల్గిస్తున్నందున సెటైరికల్గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పవన్ అభిమానులు ‘థ్యాంక్స్’ చెబుతుండడం గమనార్హం.
రేపు.. అంటే, ఫిబ్రవరి 25న ‘భీమ్లానాయక్’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. కాగా, ఆంద్రప్రదేశ్లో బెనిఫిట్ షోలకు అవకాశం లేకపోవడంతో, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లకు పవన్ అభిమానుల తాకిడి పెరిగింది.
210380 977441You got a very great internet site, Glad I observed it by way of yahoo. 875092
653130 937050Some genuinely amazing blog posts on this internet website , thankyou for contribution. 697655