Switch to English

చంద్రబాబు హయాంలో భూ కబ్జా.. అవంతి అప్పడేం చేశారు చెప్మా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,444FansLike
57,764FollowersFollow

అవంతి శ్రీనివాసరావు.. అలియాస్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు.. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత, పైగా మంత్రిగా కూడా వున్నారు. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహించిన విషయం విదితమే. చంద్రబాబు హయాంలో ఎంపీగా పనిచేసిన అవంతి మీద అప్పట్లో చాలా అవినీతి, భూ కబ్జా ఆరోపణలు చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైతే అవంతి, వైసీపీలో చేరారో.. ఆయన పునీతుడైపోయారు. ఇప్పడాయన మంత్రి హోదాలో, ఒకప్పుడు చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడుతున్నారు.. భూకబ్జాలపై మండిపడుతున్నారు.

చంద్రబాబు హయాంలో భూకబ్జాలు జరిగాయనీ, టీడీపీ నేతలు దోచుకున్నారనీ అవంతి శ్రీనివాసరావు మండిపడిపోయారు. టీడీపీ నేతలంటే ఇప్పుడు టీడీపీలో వున్న నేతలు మాత్రమేనా.? గతంలో టీడీపీలో వుండి, ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో వున్న నాయకులా.? టీడీపీకి చెందిన ఒకప్పటి కీలక నేతలు చాలామంది ఇప్పుడు వైసీపీలో వున్నారు. వాళ్ళందరికీపైనా అప్పట్లో భూ కబ్జా ఆరోపణలున్నాయి. వాళ్ళను తప్పించి, ప్రస్తుతం టీడీపీలో వున్న నేతల మీదనే వైసీపీ కబ్జా ఆరోపణలు చేస్తోందన్నమాట.

ఈ కబ్జా ఆరోపణలెందుకు చెప్మా.? అంటే.. ఇంకెందుకు, టీడీపీ నుంచి వైసీపీలోకి దూకెయ్యమని ఓ హెచ్చరిక అంతే. దూకేస్తే మళ్ళీ అవంతిలా పునీతులైపోతారు. అసలు విశాఖలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడా భూ కబ్జాలు జరిగినట్లు లెక్క కాదు. నిజానికి, చంద్రబాబు హయాంలోనే భూకబ్జాలపై సిట్ ఏర్పాటయ్యింది. ఆ సిట్ నివేదిక ఏం చెప్పింది.? అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ‘మేం అధికారంలోకి రాగానే, సిట్ విచారణ గుట్టు రట్టు చేస్తాం..’ అని అప్పట్లో వైసీపీ తెగ హడావిడి చేసింది. కానీ, అధికారంలోకి వచ్చి రెండేళ్ళయినా, ఆనాటి ఆ సిట్ రహస్యాలు ఇంకా బయటకు రాలేదు. ‘

త్వరలో సిట్ రహస్యాలు బట్టబయలు చేస్తాం..’ అని అవంతి సెలవిచ్చారు.? ఇంకెప్పుడు తెస్తారు మహాప్రభో.? అంటూ జనం మొత్తుకుంటున్నారు. ఇంకో రెండేళ్ళ తర్వాతో మూడేళ్ళ తర్వాతో ప్రభుత్వం మారొచ్చు.. రాజకీయ నాయకులూ ఇట్నుంచి అటు, అట్నుంచి ఇంటు జంపింగులు చేస్తారు.. వీరిలో కొందరు పునీతులవుతారు, కొందరు కొత్తగా పాపాత్ములవుతారు. పెద్దగా తేడాలేమీ వుండవ్.. కబ్జాలు మాత్రం నిరంతర ప్రక్రియ.. అంతే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

రాజకీయం

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఎక్కువ చదివినవి

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...