మహారాష్ట్రలో అత్యుత్సాహం ప్రదర్శించిన శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండే వ్యవహారం వివాదస్పదం అయింది. ఇటివల ముంబైలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లోని డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. మురుగు కాల్వల తీరు సరిగా లేక మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. చాంద్ వాలీ ప్రాంతంలో కూడా ఈ సమస్య నెలకొంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన ఎమ్మెల్యే దిలీప్ వాండే స్థానిక కాంట్రాక్టర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతటితో ఆగకుండా పొర్లుతున్న మురుగునీటిలో కాంట్రాక్టర్ ను కూర్చోబెట్టి.. అందులోని చెత్తను పారిశుద్ద్య కార్మికులతో ఆయన నెత్తిపై పోయించారు. దీంతో ఆయన తీరు వివాదాస్పదం అయింది. అయితే.. ఆయన చర్యను దిలీప్ లాండే సమర్ధించుకున్నారు. ప్రజల ఇబ్బందులను ఆయనకు ప్రత్యక్షంగా చూపించాను. సరిగా పని చేయని కాంట్రాక్టర్ కు ఇలా చేయడంలో తప్పులేదని తన చర్యను సమర్ధించుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
980005 79672An very fascinating go via, I may not concur entirely, even so you do make some truly legitimate factors. 525056
666944 696379Blogs ou ought to be reading […]Here is a great Blog You might Find Intriguing that we Encourage You[…] 220720