అయిపాయె.. మళ్ళీ తెలంగాణ సెగ షురూ అయ్యింది. అధినేత మెప్పు కోసమే ఆయన అలా అన్నారో.. లేదంటే, అధినేత మనసులోని మాటల్ని ఆయన వెల్లడించారోగానీ.. ఇంకోసారి తెలంగాణ సెంటిమెంటుని రగిల్చే ప్రయత్నమైతే మొదలైందని అనుకోవాలి.
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలకు సంబంధించి ఎప్పటినుంచో రచ్చ జరుగుతోంది. ఆ రచ్చ ఇప్పుడు తారాస్థాయికి చేరేలా వుంది. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నిక కోసమా.? నిజంగానే తెలంగాణ నీళ్ళ వాటా కోసమా.? ఎందుకీ ‘బురద చల్లే’ కార్యక్రమం సాటి తెలుగు ప్రజలపై తెలంగాణ రాష్ట్రానికి చెందిన కీలక నేతలు మొదలు పెట్టినట్టు.?
‘లంకలో పుట్టినోళ్ళు అందరూ రాక్షసులే.. ఆంధ్రోళ్ళు ఎన్నడూ తెలంగాణ మేలు కోరుకోరు.. తెలంగాణ ప్రజలు మరో యుద్ధానికి సిద్ధం కావాలి..’ అంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలిప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. ఏపీ ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టులపై మంత్రిగారు ఆవేశపడితే అదో లెక్క.
తెలంగాణకు అన్యాయం జరిగితే కేసీయార్ చూస్తూ ఊరుకోరంటే అది ఇంకో లెక్క. కానీ, లంకలో పుట్టినోళ్ళందరూ రాక్షసులు.. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో పుట్టినోళ్ళెవరూ తెలంగాణ బాగుని కోరుకోరు అంటే ఎలా.? ఇవి ఖచ్చితంగా జాతి వ్యతిరేక వ్యాఖ్యలుగానే భావించాలేమో. మనుషుల్ని కులాల వారీగా, ప్రాంతాల వారీగా విభజించే రాజకీయాలు ఇంకెన్నాళ్ళు.? అదీ ఓ మంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమా.?
గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల సమయంలో ‘అందరూ మనవాళ్ళే..’ అని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. చెప్పడమేంటి, తెలంగాణ వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా ఆంధ్రోళ్ళను వేరేగా చూడటం జరగలేదు. కానీ, ఇప్పుడెందుకీ రచ్చ.? ముఖ్యమంత్రి కేసీయార్ ఈ తరహా దుష్ప్రచారానికి తెర దించకపోతే.. ఈ ప్రాంతీయ విద్వేషాలు తెలంగాణకి అస్సలేమాత్రం మంచివి కావు. రెండు రాష్ట్రాల్లోని ప్రజలు ఎప్పుడూ కలసికట్టుగానే వున్నారు. నాయకులే.. తెరవెనుకాల కలిసి వుంటారు.. ప్రజల్ని విడగొట్టేందుకు ప్రయత్నిస్తుంటారు.
1950 402092Some genuinely fantastic blog posts on this internet website , regards for contribution. 523825
484 143602genuinely very good post, i certainly adore this site, keep on it 506047