కరోనా నుంచి రక్షణ పొందాలంటే వ్యాక్సిన్ వేయించుకోవడం తప్పనిసరని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరివిగా ప్రచారం చేస్తున్నాయి. అయినా.. చాలామంది ఇంకా వ్యాక్సిన్ వేయించుకోవడంలేదు. ఈనేపధ్యంలో వచ్చిన ఒక పుకారుతో ఓ గ్రామానికి చెందిన దాదాపు 700 మంది వ్యాక్సిన్ వేయించుకునేందుకు పోటెత్తారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జరిగింది సంఘటన. వ్యాక్సిన్ తీసుకోకపోతే రేషన్ నిలిపేస్తారనే ప్రచారమే వారిని ఆరోగ్య కేంద్రానికి పోటెత్తేలా చేసింది.
జిల్లాలోని నవీపేట్ మండలంలో రేపటి నుంచి టీకా ఇవ్వరని.. టీకా తీసుకోకపోతే రేషన్ నిలిపేస్తారని కొందరు వదంతులు సృష్టించారు. దీంతో 700 మందికి పైగా ప్రజలు స్థానిక ఆరోగ్య కేంద్రానికి ఉదయాన్నే వచ్చి క్యూలైనల్లో నిల్చున్నారు. టీకా కోసం పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో 500 మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తంగా ఆరోగ్యం కోసం కాకుండా పథకాల కోసమైనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు వచ్చారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
89185 458805Hiya! awesome blog! I happen to be a daily visitor to your internet site (somewhat more like addict ) of this web site. Just wanted to say I appreciate your blogs and am searching forward for much more to come! 264729
911410 254135You produced some decent points there. I looked on the internet for that concern and located most individuals goes along with along together with your internet web site. 409958