దేశంలో కొత్త రైల్వే జోన్లకు ఆస్కారం లేదంటూ పార్లమెంటు సాక్షిగా ఇటీవల కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనలో విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ప్రస్తావన లేకుండా పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై పెద్దయెత్తున రాజకీయ దుమారం చెలరేగింది.
ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ఇచ్చిన కీలకమైన హామీల్లో విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఒకటి. విభజన చట్టంలోనే కొత్త రైల్వే జోన్ అంశం ప్రస్తావించబడింది. అయితే, జోన్ సాధ్యాసాధ్యాలను పరిశీలించమని పేర్కొన్నారు తప్ప, రైల్వే జోన్ ఇవ్వాలని స్పష్టంగా పొందుపర్చలేదంటూ బీజేపీ చాన్నాళ్ళపాటు ‘కథ’ నడిపింది.
ఏపీ నుంచి రైల్వే జోన్ విషయమై కేంద్రంపై పెద్దయెత్తున ఒత్తిడి రావడంతో, తూతూ మంత్రంగా దక్షిణ కోస్తా రైల్వే పేరుతో కొత్త రైల్వే జోన్ని ప్రకటించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ‘మేం రైల్వే జోన్ ఇచ్చేశాం..’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించి కూడా ఏళ్ళు గడుస్తోంది. అయినాగానీ, రైల్వే జోన్ వాస్తవ రూపం దాల్చలేదు.
ఈ క్రమంలో రైల్వే జోన్ల పరిస్థితి ఏంటి.? అన్న ప్రశ్నకు కొత్త రైల్వే జోన్ అవకాశమే లేదంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం తెలపడం వివాదాస్పదమైంది. తాజాగా వైసీపీ ఎంపీలు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నేతృత్వంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి, రైల్వే జోన్ విషయమై విజ్ఞప్తి చేశారట. అంతలోనే, రైల్వే జోన్ కార్యకలాపాలు వెంటనే ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి హామీ ఇచ్చేశారట.
ఈ విషయాన్ని స్వయంగా విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వాస్తవానికి, ఈ విషయాన్ని వెల్లడించాల్సింది కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్. రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకులిలా కీలకమైన విషయాల్లో అస్పష్టతతో కూడిన ప్రకటనలు చేస్తూ, ముందస్తు పబ్లిసిటీ స్టంట్లు చేయడం వల్లే రాష్ట్రానికి కేంద్రం నుంచి జరగాల్సిన పనులేవీ సజావుగా సాగడంలేదు.
749741 192785Hey there! Fantastic post! Please do tell us when we shall see a follow up! 602563