‘నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. మరో పదేళ్లు నేనే సీఎంగా ఉంటాను. మరెవరూ ఇకపై ఈ అంశంపై మాట్లాడితే సహించేది లేదు. ఎవరూ పరిధి దాటి వ్యాఖ్యలు చేయొద్దు. కొన్ని రోజులుగా ఇష్టారాజ్యంగా కొందరు చేస్తున్న వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఇకపై ఎవరు ఇటువంటి వ్యాఖ్యలు చేసినా చర్యలు తప్పవు. అన్నింటినీ పరిశీలిస్తూనే ఉంటాను’ అని సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేయడమే కాదు.. కార్యకర్త నుంచి మంత్రి స్థాయి నాయకుల వరకూ వార్నింగ్ ఇచ్చారు.
రాష్ట్రానికి కేటీఆర్ సీఎం కాబోతున్నారని కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు సీఎం కేసీఆర్ పూర్తిగా చెక్ పెట్టారు. ఇటివల డిప్యూటీ సీఎం పద్మారావు, మేయర్ బొంతు రామ్మోహన్.. వంటి నాయకులు కేటీఆర్ సీఎం కావడం తథ్యం అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణలో సీఎం మార్పు ఖాయమనే విషయం జోరుగా ప్రచారం అయింది. ఈరోజు టీఆర్ఎస్ భవన్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దీనిపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే.. అందరికీ కేసీఆర్ భారీ షాక్ ఇచ్చారు. పార్టీ బలోపేతంపై పూర్తిగా దృష్టి సారించాలని ఆదేశించారు.
ఈనెల 12 నుంచి పార్టీ సభ్యత్వ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ప్రతి ఎమ్మెల్యే 50వేల సభ్యత్వాలు చేయాలన్నారు. ఏప్రిల్ లో 6లక్షల మందితో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. రాబోయే రెండు నెలలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పారు. సీల్డ్ కవర్ లో మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లు ఉంటాయని జీహెచ్ఎంసీలోనే కవర్ ఓపెన్ చేయాలని అన్నారు.
795039 982641Wonderful beat ! I wish to apprentice although you amend your web internet site, how can i subscribe for a weblog website? The account aided me a appropriate deal. I had been a little bit acquainted of this your broadcast provided bright clear notion 803574