ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తుంది. ఇండియాలో కరోనా లక్షల సంఖ్యలోకి చేరిపోయింది. ప్రతి రోజు 10 వేలకు మించిన కేసులు నమోదు అవుతున్నాయి. ఈ సమయంలో ఎక్కువ మందికి లక్షణాలు లేకుండా ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ వస్తుంది. ఇప్పటి వరకు కరోనా లక్షణాలుగా భావించిన దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటంతో పాటు మరో కొత్త లక్షణంను కూడా కరోనా లక్షణం జాబితాలో చేర్చడం జరిగింది.
కెనడాకు చెందిన అల్బెర్టా యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు కళ్లు ఎర్రగా అవ్వడం కూడా కరోనా లక్షణంగా గుర్తించారు. ఇతర లక్షణాలు లేకుండా కేవలం కళ్లు ఎర్రగా అయినా కూడా కరోనా సోకినట్లుగా గుర్తించాలంటూ వారు చెబుతున్నారు. ఇటీవల కొందరికి కళ్లు ఎర్రగా అవ్వడంను గుర్తించారు. సాదారణంగా అది డస్ట్ ఎలర్జీ వ్ల వచ్చి ఉంటుందని అనుకున్నారు. కాని కళ్లు ఎర్రగా ఉన్న అందరిని పరీక్షించగా వారందరికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అన్నారు. అందుకే ఇకపై కళ్లు ఎర్రగా అయినా కూడా అశ్రద్ద చేయకుండా వెంటనే కోవిడ్ టెస్టు నిర్వహించుకోండి.
333105 502868I think this really is one of the most significant info for me. And im glad reading your article. But want to remark on some general issues, The internet website style is perfect, the articles is actually great : D. Good job, cheers 759084