టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శ్రీకాకుళం పర్యటనకు వెళ్లారు. ఆయన వెళ్లింది పార్టీ కార్యక్రమాల కోసం కాదు. వందల కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఇటివల అరెస్టయిన అచ్చెన్నాయుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. ఈరోజు ఉదయం రోడ్డు మార్గాన బయలుదేరిన లోకేశ్ మధ్యాహ్నానికి కోటబొమ్మాళి మండలం నిమ్మాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా దివంగత ఎర్రన్నాయుడి చిత్రపటానికి పూలమాల విస నివాళులర్పించారు. అనంతరం అచ్చెన్నాయుడి కుటుంబాన్ని పరామర్శించారు.
లోకేశ్ ఇటివల పార్టీ నేతల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఇటివలే అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాన్ని అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. లారీ కోసం రిజిస్ట్రేషన్లు చేయించుకున్న ఛాసిస్ లను ప్రైవేటు బస్సులు తిప్పేందుకు ఉపయోగించారనే ఆరోపణలపై ఆయనతో పాటు ఆయన కుమారుడ్ని కూడా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ పక్షపాత ధోరణికి వెళ్తోందని ఈ రెండు కేసులు అక్రమమేనని వాదిస్తున్నారు టీడీపీ నాయకులు. ఈనేపథ్యంలోనే నారా లోకేశ్ వీరి కుటుంబాలను పరామర్శిస్తున్నారు.
43223 875206Giving you the most effective News is quite much imptortant to us. 522997
131092 627633Some really nice stuff on this web internet site , I love it. 277335
811242 537258I came to the exact conclusion as properly some time ago. Fantastic write-up and I is going to be positive to appear back later for a lot more news. 791786