న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆగస్ట్ వరకూ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు లేవు. ఈ చిత్రం రీతూ వర్మ హీరోయిన్ కాగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే టక్ జగదీశ్ కంటే నాని తర్వాత చేయబోతున్న శ్యామ్ సింగ రాయ్ పైనే బజ్ ఎక్కువగా ఉంది. ఈ లాక్ డౌన్ సమయంలో ఈ చిత్రంపై లెక్కలేనన్ని రూమర్లు వచ్చాయి.
టాక్సీవాలా చిత్రాన్ని తెరకెక్కించిన రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. బెంగాల్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్ర కథ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని ఇప్పటికే స్పష్టమైంది. ఇందులో సాయి పల్లవి మెయిన్ హీరోయిన్ గా నటించనుంది. ఇక మిగిలిన ఇద్దరు హీరోయిన్లను ఫైనల్ చేయాల్సి ఉంది. రెండో హీరోయిన్ గా రష్మికను సంప్రదించగా ఆమె దానికి ఓకే చెప్పలేదు. ప్రస్తుతం తన కెరీర్ ఫుల్ ఫ్లో లో ఉండడంతో సెకండ్ హీరోయిన్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మిగిలిన హీరోయిన్ పాత్రలకు తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల, మాళవిక మోహనన్ లను తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
372409 707301Excellent blog here! Also your internet site loads up rapidly! What host are you making use of? Can I get your affiliate link to your host? I wish my web site loaded up as rapidly as yours lol 74489
111131 514894numerous thanks for telling!. Truth is normally the best vindication against slander. by Abraham Lincoln.. 757426