బాబు పేరు వింటే చాలు వైకాపా నేతలు గయ్ మంటూ లేస్తున్నారు. ఒంటికాలిపై విరుచుకుపడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం అసెంబ్లీలో మెజారిటీ లేదు కాబట్టి వైకాపా నేతలు ఏం చేసినా ఎన్ని మాటలు మాట్లాడినా సరే కామ్ గా ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. శీతాకాల సమావేశాలు జరిగిన ఆఖరు రోజున అమరావతి అంశం చర్చకు వచ్చింది. గతంలో అమరావతిలోనే రాజధాని ఉంటుందని ప్రకటించిన వైకాపా ఆ తరువాత మాట మార్చింది.
మాట మార్చము, మడమ తిప్పం అని చెప్పిన వైకాపా అవలీలలాగా మాట మార్చింది. అమరావతి విషయంలో వేసిన కమిటీ నివేదిక ఇంకా రాకముందే రాజధాని అంశంపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేసి అందరికి షాక్ ఇచ్చింది. రాజధాని అమరావతిలోని కాకుండా మూడు ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉన్నట్టు చెప్పుకొచ్చింది. అమరావతిలో శాసనసభ, విశాఖలో సాధారణ పరిపాలన, కర్నూలులో హైకోర్టును ఏర్పాటు జరిగే అవకాశాలు ఉన్నట్టు చెప్పింది.
సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పడంతో రాజధాని ప్రాంత రైతులు భగ్గుమన్నారు. వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అంగీకరిస్తూ నిండుసభలో చెప్పిన సంగతి తెలిసిందే. కనీసం 30వేల ఎకరాల్లో అమరావతిని ఏర్పాటు చేయాలని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చి అమరావతిలోనే రాజధాని కాకుండా మరో రెండు చోట్ల కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం మాట తప్పడం కాదా, మడమ తిప్పడం కాదా అని ట్విట్టర్ ద్వారా లోకేష్ ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
702663 561143the most common table lamp these days nonetheless use incandescent lamp but some of them use compact fluorescent lamps which are cool to touch.. 455280
366407 435604Hello. exceptional job. I did not anticipate this. This is a splendid articles. Thanks! 823768
881568 350448I added this article to my favorites and program to return to digest much more soon. It is straightforward to read and comprehend as well as intelligent. I truly enjoyed my initial read through of this post. 46032