Nara Lokesh : ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ రెండో రోజు సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరు అయ్యారు. విచారణకు ఒక్క రోజు హాజరు అయితే చాలని కోర్టు తెలిపింది. కానీ సీఐడీ అధికారులు మాత్రం రెండు రోజుల పాటు విచారణ జరిపారు అంటూ నారా లోకేష్ ఆరోపించారు.
మొదటి రోజు 50 ప్రశ్నలు వేసిన అధికారులు.. వాటినే అటు తిప్పి ఇటు తిప్పి మళ్లీ ఈ రోజు ప్రశ్నించారు అంటూ లోకేష్ విమర్శించాడు. నేడు 47 ప్రశ్నలు అడిగితే అందులో రెండో మూడో కొత్త ప్రశ్నలు ఉన్నాయి. మొత్తం పాత ప్రశ్నలే అన్నట్లుగా లోకేష్ ఆరోపించాడు. ఈ కసుకు సంబంధించిన ప్రశ్నలు తక్కువ.. ఇతర ప్రశ్నలు ఎక్కువ అన్నట్లుగా కూడా లోకేష్ ఎద్దేవ చేశాడు.
విచారణ సమయంలో నా ముందు ఓ డాక్యుమెంట్ పెట్టారు. అందులో మా అమ్మ నారా భువనేశ్వరి గారి ఐటీ రిటర్న్ లు ఉన్నాయి. ఇది మీ వద్దకు ఎలా వచ్చిందని నేను సీఐడీ అధికారులను ప్రశ్నించాను. వారి నుంచి సరైన సమాధానం రాలేదు. ఈ కేసు తో సంబంధం లేని మా అమ్మగారి ఐటీ రిటర్న్స్ ను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని నేను దర్యాప్తు అధికారులను సూటిగా ప్రశ్నిస్తే వారు సమాధానం దాటవేశారు. ఈ విషయాన్ని నేను సీరియస్ గా తీసుకోవాలని భావిస్తున్నాను.