YS Sharmila : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మ్రోగింది. ఈ నేపథ్యం లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ లో తన పార్టీని విలీనం చేయడం లేదంటే.. ఆ పార్టీ తో పొత్తు పెట్టుకుని మూడు నాలుగు అసెంబ్లీ స్థానాలను అడగాలని భావించిన షర్మిలకు తిరష్కర ఎదురైంది.
షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గట్టిగా వ్యతిరేకించాడు. అయినా కూడా పార్టీ అధినాయకత్వం ఆమె ని తీసుకోవాలని భావించింది. కానీ ఆమె కండీషన్స్ కి కాంగ్రెస్ అధినాయకత్వం ఒప్పుకోలేదు. దాంతో షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రకటించింది.
తెలంగాణ లో బలంగా ఉన్న నియోజక వర్గాల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న షర్మిల అదే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. షర్మిల పాలేరు మరియు మిర్యాలగూడ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక విజయమ్మ ను సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయించాలని నిర్ణయించారు. సూర్యపేట నుంచి పిట్ట రాంరెడ్డి, సత్తుపల్లి నుంచి కవిత, భోదన్ నుంచి సత్యవతి, కల్వకుర్తి నుంచి అర్జున్ రెడ్డి ఇంకా కొంత మంది పేర్లను పరిశీలిస్తున్నారు. మొత్తానికి వైఎస్సార్టీపీ పోటీ కన్ఫర్మ్ అవ్వడంతో పోటీ మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.