విశాఖ గ్యాస్ లీకేజీ సంఘటన ఇంకా మర్చి పోక ముందే వరుసగా గ్యాస్ లీకేజీ సంఘటనలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఈ లీకేజీ సంఘటనలు జనాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో గ్యాస్ లీక్ అయ్యింది. ఆసమయంలో అక్కడ డ్యూటీ చేస్తున్న 50 ఏళ్ల శ్రీనివాసరావు మృతి చెందారు. మేనేజర్ అయిన శ్రీనివాసరావు అక్కడికి అక్కడే మృతి చెందగా మరికొంత మంది అస్వస్థతకు గురి అయ్యారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు.
గ్యాస్ లీకేజీ గురించి జిల్లా కలెక్టర్ వీర పాండియన్ స్పందించారు. గ్యాస్ లీకేజీ కేవలం లోపల వరకే. బయటకు రాలేదు కనుక ఎలాంటి ప్రమాదం లేదు. ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎమర్జెన్సీ బృందాలు మరియు అధికారులు అక్కడకు చేరుకున్నారు. కనుక ప్రజలు ఆందోళన చెంది పరుగులు పెట్టనక్కర్లేదు అంటూ కలెక్టర్ సూచించారు. ఆ తర్వాత స్వయంగా కలెక్టర్ వీరపాండియన్ సంఘటన స్థలంలో పర్యటించారు. జనాలు మాత్రం ఇంకా భయం గుప్పిట్లోనే ఉన్నారు.
#BreakingNews: నేడు కర్నూల్ జిల్లా, నంద్యాల శివారులోని #SPYAgro కంపెనీ లోపల అమ్మోనియా గ్యాస్ లీక్ అవ్వడం వలన 50 సం.ల ఒక ఉద్యోగి మృతి చెందగా, మరో ముగ్గురి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కంపెనీ లోపలే గ్యాస్ లీక్ అవ్వడం వలన బయట ఎలాంటి ప్రమాదం లేదని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. pic.twitter.com/SklDO64e2J
— TeluguBulletin.com (@TeluguBulletin) June 27, 2020