MS Dhoni: టీమిండియా (Team India) మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) అంటే విపరీతమైన క్రేజ్. ఇప్పటికీ ధోనీ పేరు మంత్రంలా జపిస్తారు అభిమానులు. ఇటివలి ఐపీఎల్ సీజన్-16 (IPL-16) లో కూడా ధోనీ పేరు ఎలా మోగిపోయిందో తెలిసిన విషయమే. ఇంతటి క్రేజ్ ఉన్న ధోనీ ఏం చేసినా అభిమానులకు స్పెషలే. అటువంటి ఓ చిన్న ఇన్సిడెంటే ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
ఇటివల ధోనీ ఆయన భార్య సాక్షితో కలిసి విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఈక్రమంలో ఎయిర్ హోస్టెస్ ఆయనకు చాక్లెట్స్ ఇచ్చేందుకు వెళ్లింది. ఆ సమయంలో ధోనీ ట్యాబ్ లో క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూ కనిపించాడు. ఎయిర్ హోస్టెస్ ఇచ్చిన చాక్లెట్స్ లో ఒకటి ధోనీ తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
అయితే.. ధోనీ ఆడుతున్నక్యాండీ క్రష్ గేమ్ కు ఈ వీడియో తర్వాత డౌన్లోడ్స్ భారీగా పెరిగిపోయాయని తెలుస్తోంది. ఇదంతా ధోనీ క్రేజ్ వల్లనే అంటున్నారు. ఖాళీ సమయాల్లో ఈ-స్పోర్ట్స్ ఆడుతూంటానని ఆమధ్య ధోనీ చెప్పుకొచ్చాడు.
MS Dhoni – the crowd favourite. pic.twitter.com/ltpud9P9Jj
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2023