పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas)నటించిన ‘ఆది పురుష్’ పదో రోజు మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ ఒక్కరోజే సుమారు రూ.2కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. మొత్తంగా ఈ సినిమా ఇప్పటివరకు రూ. ప్రపంచవ్యాప్తంగా రూ.379.40 కోట్లు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ.240 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే పది రోజుల్లో రూ.189 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఇంకా బ్రేక్ ఈవెన్ కు రూ. 54 కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉంది. వచ్చేనెల 28వ తేదీ వరకు మరే పెద్ద సినిమా విడుదల లేకపోవడం ఈ సినిమాకు కలిసి వచ్చే విషయం.
అయితే, పదో రోజు ఆదివారం కావడంతో వసూళ్లు బాగానే వచ్చినా.. రూ. 50 కోట్ల బ్రేక్ ఈవెన్ అంటే కష్టమనే చెప్పాలి. విడుదల సమయంలో తొలి పది రోజులు టికెట్ రేట్లను పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. పది రోజులు పూర్తి అవ్వడంతో టికెట్ రేట్లను కూడా తగ్గించారు. ఈ ప్రభావం కూడా బ్రేక్ ఈవెన్ పై పడనుంది.
విడుదలైన తొలి రోజు నుంచి ఈ సినిమాని విమర్శలు, వివాదాలు చుట్టుముట్టడం కలెక్షన్లకు ప్రతికూలంగా మారింది. ఇక సినిమా విషయానికొస్తే ఇందులో ప్రభాస్( Prabhas)రాముడిగా కృతి సనన్( Krithi Sanon)సీతగా, సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan) రావణుడిగా నటించారు. ఓం రౌత్ దర్శకుడు ఈనెల 16న ఈ సినిమా విడుదలైంది.