హైదరాబాద్ నగర శివారులోని శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగుగా వస్తున్న కారును తప్పించబోయిన ఓ లారీ బోల్తాపడిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా ఒడిశాలోని బలంగిర్ జిల్లాలోని డాబుగా బ్లాక్ చికిలి గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ప్రమాద సమయంలో లారీలో 50 మంది వరకూ ఉన్నారు. వీరంతా సుల్తాన్ పల్లిలోని ఇసుకబట్టీల్లో పని చేసే కూలీలు.
ఆదివారం కావడంతో ఇంట్లోకి కావల్సిన నిత్యావసరాలు, కూరగాయలు కొనేందుకు వీరంతా లారీలో శంషాబాద్ కు బయలుదేరి వెళ్లారు. అవసరమైనవన్నీ కొనుక్కుని తిరిగి వస్తూండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతలో లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో చాలాసేపు ట్రాఫిక్ కూడా స్తంభించింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. లారీని జేసీబీ సాయంతో పక్కకు తొలగించారు. మృతి చెందినవారిలో కళాకుమార్ సునా, కృపా సునా, గోపాల దీప్, బుదన్, హస్తా యాదవ్ ఉన్నారు.
996221 985449Immer etliche Firmen bentzen heutzutage Interimmanagement als innovatives und ergnzendes Gertschaft i. Spanne der Unternehmensfhrung. Denn hiermit wird Kenntnisstand leistungsfhig, bedarfsgerecht und schnell ins Unternehmen geholt. 809969
946447 826149appreciate the effort you put into obtaining us this information 280776