ఇటివలే బందరులో వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య మర్చిపోకముందే మరో హత్యోదంతం పట్టణవాసులను ఉలిక్కిపడేలా చేసింది. మచిలీపట్నంలోని మాచవరం ప్రాంతంలో ఈ హత్యాయత్నం జరిగింది. మారుతీ కారు ఫైనాన్స్ కట్టాలని వెళ్లి అడిగిన వ్యక్తిని తండ్రీకొడుకులు దారుణంగా కత్తితో పోడిచిన ఘటన కలకలం రేపుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నంలోని చిలకలపూడికి చెందిన జ్యువెలరీ షాపు యజమాని నాగేశ్వర రావు అతని కుమారుడు కారు ఫైనాన్స్ కట్టాల్సి ఉంది. ఫైనాన్స్ డబ్బులు వసూలు కోసం పెడన దక్షిణ తెలుగుపాలెం 19వ వార్డుకి చెందిన గుడిసె రాకేశ్ వెళ్లాడు. అతడిని మాచవరంలో రోడ్డు పక్కనే వాళ్ళ దుకాణాల వద్ద కత్తితో పొడిచారు.
అనంతరం పక్కనే ఉన్న డ్రైనేజీ లో రాజేశ్ ను పడేసి తండ్రీకొడుకులిద్దరూ పరారయ్యారు. ఇదంతా పథకం ప్రకారమే చేసారని తెలుస్తోంది. ఈమేరకు సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మచిలీపట్నం చిలకలపూడి ప్రాంతానికి చెందిన జ్యువెలరీ షాపు యజమాని నాగేశ్వరరావు అతని కుమారుడు కలిసి రాజేశ్ పై హత్యాయత్నానికి పాల్పడ్డారని ప్రాధమిక నిర్దారణకు వచ్చారు.
రాజేశ్ పై హత్యాయత్నం చేసిన తండ్రికొడుకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కత్తిపోట్లతో గాయపడ్డ గుడిసె రాజేష్ ను వైద్యం నిమిత్తం మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజేష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.
782157 768152I discovered your site website online and check several of your early posts. Keep on the top notch operate. I just now additional your Feed to my MSN News Reader. Looking for forward to reading a lot more from you discovering out later on! 474010
418217 457640As soon as I discovered this internet web site I went on reddit to share some with the enjoy with them. 629222
465373 689606I like this internet internet site its a master peace ! Glad I detected this on google . 239856