గతంలో బీజేపీని దారుణంగా విమర్శించిన టీడీపీ నేతలే ఇప్పుడు బీజేపీలో చేరి కేంద్రానికి వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ‘గత ఎన్నికల్లో ఓటమిపాలైన టీడీపీ తదనంతర కాలంలో బీజేపీలో చేరారు. వైసీపీ అధికారం చేపట్టడంతో ప్రభుత్వంపై కేంద్రానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. టీడీపీ నాయకులుగా గతంలో బీజేపీని విమర్శించారు. ఇప్పుడు బీజేపీలో చేరి అధిష్టానాన్ని సులభంగా కలుసుకుని రాష్ట్రంపై నిరాధార ఆరోపణలను చేరవేస్తున్నారు.
గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని పూర్తిగా విస్మరించి సంక్షోభంలోకి నెట్టేసింది. జగన్ ప్రభుత్వంలో విద్యుత్ రంగాన్ని ఆదుకునేందుకు సిద్ధమైంది. రూ.17,904 కోట్లతో తమ ప్రభుత్వం విద్యుత్ రంగానికి కేటాయించింది. పరిశ్రమలకు విద్యుత్ టారిఫ్ కూడా పెంచలేదు. రాష్ట్రంలో విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకొస్తున్నయి. గ్రీన్ కో సంస్థ ఇందుకు ఆసక్తి చూపుతోంది. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల ఎక్కువ రేటుతో విద్యుత్తు కొనాల్సి వస్తోంది. NTPC, KUDGI వంటి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి యూనిట్ కు రూ.9.44 అధిక రేటు వెచ్చించాల్సి వస్తోంది.
ఇంటర్ ట్రాన్సిమిషన్ కోసం ఇతర రాష్ట్రాలు మెగావాట్ కు 1లక్ష మాత్రమే చెల్లిస్తున్న PGCIL కేంద్ర ప్రభుత్వ సంస్థకు 5.5 లక్షల రూపాయలు చెల్లిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాం. విపక్షాలు చేసే ఏ ఆరోపణలను ప్రభుత్వ వివరణ లేకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఓ నిర్ణయానికి రావొద్దని కోరుతున్నాం. ఎటువంటి వివరణ ఇవ్వడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం’ అని లేఖ రాశారు.
443576 415390I was reading by means of some of your content material on this internet site and I believe this website is genuinely instructive! Keep putting up. 748824
273952 581314Lovely sharp post. Never considered that it was that effortless. Praises to you! 519490
597395 63870Companion, this internet internet site will be fabolous, i merely like it 46399
422716 293717hi and thanks for the actual blog post ive recently been looking regarding this specific advice on-line for sum hours these days as a result thanks 106927