ప్రస్తుతం బాలీవుడ్ లో మరో ప్రేమ్ కహాని .. జోరుగా వినిపిస్తుంది. వీరిద్దరూ కలిసి .. జోరుగా షికార్లు చేస్తున్నారని, ప్రేమ లోకంలో విహరిస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా ఓ రేంజ్ ప్రచారం జరుగుతుంది. ఇంతకు ఎవరా హీరోయిన్ ఏమా కథ అంటే .. !! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తీన్మార్ సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి కర్బందా గుర్తుందిగా .. ఆ తరువాత ఒంగోలు గిత్త సినిమాలో నటించిన ఈ అమ్మడికి సరైన సక్సెస్ అందుకోలేక, రామ్ చరణ్ కు అక్కగా బ్రుస్ లీ సినిమాలో నటించింది. అది కూడా వర్కవుట్ కాకపోవడంతో మళ్ళీ బాలీవుడ్ లోనే సెటిల్ అయిన ఈ అమ్మడు బాలీవుడ్ హీరో పులకిత్ సామ్రాట్ తో ప్రేమలో పడిందంటూ ప్రచారం జరుగుతుంది.
వీరిద్దరి కలిసి గత ఏడాది వీర్ కి వెడ్డింగ్ అనే సినిమాలో నటించారు. అప్పటి నుండి ఇద్దరి మధ్య ఎదో తెలియని ఎఫెక్షన్ ఉందని బి టౌన్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో పెద్ద ట్విస్ట్ ఉంది .. పులకిత్ కు నాలుగేళ్ళ క్రితమే శ్వేతా రోహిరా తో వివాహం అయింది. ఆ తరువాత రెండేళ్లకే వారిద్దరూ విడిపోయారు. అప్పటి నుండి వంటరిగా ఉంటున్న పులకిత్ తాజాగా మరో సారి సి కృతి తో కలిసి నటిస్తున్నాడు. పాగల్ పంటి టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబై లో జరుగుతుంది.
Also Read: ఆ హీరోయిన్ ని లిప్ లాక్ ప్రాక్టీస్ చేద్దామని అడిగిన దర్శకుడు ఎవరు
ఈ సినిమా షూటింగ్ లో వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటున్నారని, ఇద్దరి మధ్య ప్రేమాయణం మొదలైందని అటు యూనిట్ లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆ మధ్య విడాకులు తీసుకున్న తరువాత పులకిత్ .. హాట్ గర్ల్ యామి గౌతమ్ తో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి .. ఇప్పుడేమో ఇతగాడు కృతి తో సన్నిహితంగా మెలగడం ఆసక్తి రేపుతోంది.