నటీనటులు చాలా పోష్ లైఫ్ అనుభవిస్తున్నట్లు పైకి కనిపిస్తారు కానీ వాళ్ళు బాడీ మైంటైన్ చేయడం కోసం అనుకున్నది తినలేరు, కావాల్సినట్లు జీవించలేరు. రంగ్ దే టీమ్ పోస్ట్ చేసిన చిన్న వీడియో బిట్ ను చూస్తే అది నిజం కాదనకుండా ఉండలేం.
సెట్స్ లో కీర్తి సురేష్, నితిన్ ల మధ్య చోటు చేసుకున్న ఫన్నీ ఇన్సిడెంట్ ను షేర్ చేసుకున్నారు. లంచ్ బ్రేక్ లో కీర్తి పండ్లు తింటుంటే నితిన్ మాత్రం పిజ్జా తింటుంటాడు. అయితే కామ్ గా తినకుండా కీర్తి సురేష్ ను ఊరిస్తూ తింటాడు. ఒక్క చిన్న బైట్ నాకోసం తినొచ్చు కదా అని అంటాడు. మొదట చాలా కంట్రోల్ చేసుకున్న కీర్తి చివరికి చిన్న పిజ్జా బైట్ చేస్తుంది. దీన్ని రంగ్ దే ప్రమోషన్స్ కోసం వాడుతున్నారు. ఈ సినిమా మార్చ్ 26న విడుదల కానుంది.