అధికారం చేతిలో లేకుంటే కొంతమందికి నిద్రపట్టదు. చేతిలో పదవి అధికారం ఉన్నప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. అలాంటి వ్యక్తులు పదవుల కోసం ఎలాంటి నీచమైన పనులు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. నిన్నటి వరకు పొగిడిన నోటితోనే తిట్టేసి గేటు దూకేస్తారు. గతంలో తిట్టిన వాళ్ళను నియంత వాళ్ళు లేరు అని పొగిడేస్తుంటారు. అదేమంటే అదంతే అధికారంలో ఉన్న పార్టీవైపు ఉంటేనే పనులు జరుగుతాయని చెప్తుంటారు.
ఇలాంటి వారిలో కారెం శివాజీ ఒకరు. 2014 ఎన్నికల తరువాత కారెం శివాజీ తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయనకు టిడిపి ప్రభుత్వం ఏపీ ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని అప్పగించింది. ఆ పదవిలో చేరిన ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఆ పదవికి అనర్హుడు అంటూ హైకోర్టులో చాలామంది పిటిషన్లు దాఖలు చేశారు. ఆ కేసు ఇంకా కోర్టులోనే ఉన్నది.
2019లో అధికారం మారింది. టిడిపి ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు తీసుకొని అధికారం చలాయించిన వారంతా రాజీనామాలు చేశారు. అయితే కారెం మాత్రం నిన్నటి వరకు రాజీనామా చేయలేదు. నిన్ననే రాజీనామా చేశారు. రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైకాపాలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు.
ఈరోజు వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నాడు. ఎలాగో పార్టీలో చేరాడు కాబట్టి ఆ పదవిని తిరిగి ఆయనకే ఇస్తారు అందులో సందేహం ఏమున్నది. దానికోసమే కదా అయన పార్టీ మారింది. అధికారం కోసం ఇలాంటి వ్యక్తులు ఎలాంటి గోడలు దూకడానికైనా సిద్ధంగా ఉంటున్నారు. రాజకీయాలు ఇలా ఉన్నాయి కాబట్టే దేశం ముందుకు కదలడం లేదు.
783979 421340one of the finest system I know, thank you really significantly . 519178
292279 494945light bulbs are very good for lighting the home but stay away from incandescent lamps because they generate so considerably heat;; 255873
884920 451791I havent checked in here for some time as I thought it was obtaining boring, but the last couple of posts are great quality so I guess Ill add you back to my everyday bloglist. You deserve it my friend 816219