సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య కేసు నిందితులను పోలీసులు ఛేదించారు. ఘటన జరిగిన అనంతరం కొన్ని గంటల్లోనే ఈ ఘాతుకానికి పాల్పడిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఫీడ్, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా లారీ డ్రైవర్, క్లీనర్ తోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా కొల్లూరు వెటర్నరీ ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్ ప్రియాంకను బుధవారం రాత్రి శంషాబాద్ సమీపంలోని ఓఆర్ఆర్ టోల్ గేటు వద్ద పథకం ప్రకారం కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెపై అత్యాచారం చేసి ఆపై చంపేశారు. అనంతరం చటాన్ పల్లి అండర్ పాస్ లో మృతదేహాన్ని కాల్చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేశారు.
టోల్ గేటు వద్ద పార్క్ చేసి ఉంచిన ప్రియాంక స్కూటీని ఉద్దేశపూర్వకంగా వారు పంక్చర్ చేసిన విషయం బయటపడింది. అనంతరం పంక్చర్ వేసి తీసుకొస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఆమెను టోల్ గేటు వద్దకు వెళ్లనీయకుండా అక్కడే ఉంచేశారు. అనంతరం ఒక్కసారిగా ఆమెను లారీ వెనకకు తీసుకెళ్లి, అక్కడ నుంచి సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
అనంతరం చంపేసి మృతదేహాన్ని లారీలో వేసుకుని అక్కడి నుంచి చటాన్ పల్లి బ్రిడ్జి వైపు తీసుకెళ్లినట్టు తేలింది. ఆమె స్కూటీని నడుపుకుంటూ ఆ లారీని ఓ వ్యక్తి అనుసరించినట్టు వెల్లడైంది. అనంతరం నలుగురూ కలిసి మృతదేహానికి దుప్పట్లు చుట్టి, అండర్ పాస్ బ్రిడ్జి కిందకు తీసుకెళ్లి కిరోసిన్ పోసి నిప్పంటించి వెళ్లిపోయారు.
ఈ కేసులో మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటకు చెందిన లారీ డ్రైవర్ మహ్మద్ పాషా ప్రధాన నిందితుడని తెలుస్తోంది. ఆమెపై అత్యాచారం జరిపి, కిరోసిన్ పోసి నిప్పంటించినట్టు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తేలింది.
173131 30776Having been simply searching at beneficial blog articles with regard to the project research when My partner and i happened to stumble on yours. Thanks for this practical info! 195472
216129 869400I believe your suggestion would be valuable for me. I will let you know if its function for me too. Thank you for sharing this beautiful articles. thanks a good deal 689843