Kapil Dev: వన్డే ప్రపంచ కప్ మరి కొన్ని వారాలు ఉన్న ఈ సమయంలో వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీం ఇండియా ఘోరంగా ఓడిపోవడం పట్ల మాజీ క్రికెటర్లు మరియు క్రికెట్ అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలోనే బీసీసీఐ తీరుపై కూడా కొందరు సీనియర్ లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.
తాజాగా క్రికెటర్ కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ఇండియాలో ప్రపంచ కప్ జరుగబోతున్నా కూడా ఆటగాళ్లు ఎక్కువగా ప్రయాణించాల్సి వస్తుంది. అలా వారు ప్రయాణించడం వల్ల ఎక్కువగా అలసి పోయే అవకాశం ఉంది. మ్యాచ్ లు ఆడటం కోసం ధర్మశాలకు, అక్కడి నుండి బెంగళూరుకు, అక్కడ నుండి కోల్ కత్తాకు ఇలా సుదీర్ఘమైన ప్రయాణాలు చేస్తే వారు అలసి పోతారు అంటూ కపిల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఒక వేళ తానే బీసీసీఐ ప్రెసిడెంట్ అయ్యి ఉంటే మన ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా చార్టెర్డ్ విమానంను సమకూర్చేవాడిని. మైదానం లో వారు పూర్తి స్వేచ్చగా పూర్తి స్థాయి ప్రదర్శణ ఇవ్వాలి అంటే వారు బయట అలసి పోకూడదు అంటూ కపిల్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కపిల్ కు చాలా మంది మద్దతు తెలుపుతున్నారు. మరి బీసీసీఐ ఎలా రెస్పాన్స్ అవ్వబోతుందో చూడాలి.