అయితే, కమ్మ సామాజిక వర్గం.. లేదంటే రెడ్డి సామాజిక వర్గం.! అంతేనా, ఈ రెండూ తప్ప, ఇంకో సామాజిక వర్గం అధికార పీఠమెక్కకూడదా.? ఈ చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ వర్సెస్ రెడ్డి తప్ప, ఇంకో సామాజిక వర్గం అధికార పీఠమెక్కాలన్న దిశగా అసలు చర్చ జరగడంలేదా.? జరగనివ్వడంలేదా.?
మంత్రి అంటి రాంబాబు, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సొంత సామాజిక వర్గం ‘మాకు రాజ్యాధికారం కావాలి’ అనడంపై సెటైర్లు వేశారు. ‘పిచ్చి కాపు యువత..’ అంటూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు, ‘సీఎం సీఎం.. అంటూ పవన్ కళ్యాణ్ని చూసి నినదించే కాపు యువత’ మీద ఆయన వేసిన సెటైర్లపై, ప్రముఖ న్యాయవాది, జనసేన సానుభూతిపరుడు కళ్యాణ్ దిలీప్ సుంకర తన ‘కామనర్ లైబ్రరీ’ అనే యూ ట్యూబ్ ఛానల్ ద్వారా స్పందించారు, ప్రస్తుత రాజకీయాల్ని విశ్లేషించారు.
ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరంజీవి మీద కాపు ముద్ర వేసి, చిరంజీవికి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే వెన్నుపోటు పొడిచిన వైనం దగ్గర్నుంచి, పవన్ కళ్యాణ్కి దూరంగా వుండాలంటూ కాపు సామాజిక వర్గంపై వైసీపీలోని కాపు సామాజిక వర్గ నేతలే చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేయడం వరకు.. వివిధ అంశాల గురించి మాట్లాడారు కళ్యాణ్ దిలీప్ సుంకర.
పవన్ కళ్యాణ్ విశ్వసనీయతను అంబటి రాంబాబు ప్రశ్నించడంపై కళ్యాణ్ దిలీప్ సుంకర తనదైన స్టయిల్లో విమర్శలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అంబానీనే చంపేయించాడంటూ రిలయన్స్ సంస్థలపై దాడులు చేయించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అదే అంబానీ సూచనతో ఏపీకి సంబంధించిన రాజ్యసభ సీటుని సమర్పించేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు కళ్యాణ్ దిలీప్ సుంకర.
కాంగ్రెస్ పార్టీని ఎదిరించి నిలబడ్డ ధీశాలి.. అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి వైసీపీ నేతలు చెబుతుంటారనీ, అదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థికి ఓటేసి, బెయిల్ తెచ్చుకున్నది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాదా.? అని కళ్యాణ్ దిలీప్ సుంకర ప్రశ్నించారు.
‘వీరుడెక్కడ.? శూరుడెక్కడ.? గడచిన మూడేళ్ళలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు మాట తప్పారు.? ఎన్నిసార్లు మడమ తిప్పారు.? రాజకీయ పార్టీలకు రాజకీయ వ్యూహాలుంటాయ్.. జనసేనకీ కొన్ని వ్యూహాలంటాయి. బీజేపీ తెరవెనుక అంటకాగుతున్న వైసీపీది రాజకీయమా.? జనసేనది రాజకీయం కాదా.?’ అంటూ కళ్యాణ్ దిలీప్ సుంకర, అంబటి రాంబాబుపై మండిపడ్డారు.
‘మిమ్మల్ని మీరు జంతువులతో పోల్చుకుంటున్నారు.. మీ యజమానికి బానిసలుగా వుంటున్నారు.. మీరు మళ్ళీ కాపు యువత, పవన్ కళ్యాణ్ వైపు చూడొద్దు..’ అంటున్నారు. ఏది మీ విశ్వసనీయత.? అని నిలదీశారు కళ్యాణ్ దిలీప్ సుంకర. ‘చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటివాళ్ళను చూసి కాపు యువత స్ఫూర్తి పొందుతోంది.. అందులో మేం కూడా వున్నాం.. మిమ్మల్ని చూసి ఏం స్ఫూర్తి పొందాలి.? మీ బానిసత్వమే మాకు వారసత్వమా.?’ అంటూ కళ్యాణ్ దిలీప్ సుంకర అసహనం వ్యక్తం చేశారు.
820693 664756I normally cant locate it in me to care enough to leaves a comment for articles on the internet but this was in fact pretty great, thanks and keep it up, Ill check back once more 357780