Switch to English

కాపు సామాజికవర్గమెందుకు అధికార పీఠమెక్కకూడదు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

అయితే, కమ్మ సామాజిక వర్గం.. లేదంటే రెడ్డి సామాజిక వర్గం.! అంతేనా, ఈ రెండూ తప్ప, ఇంకో సామాజిక వర్గం అధికార పీఠమెక్కకూడదా.? ఈ చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ వర్సెస్ రెడ్డి తప్ప, ఇంకో సామాజిక వర్గం అధికార పీఠమెక్కాలన్న దిశగా అసలు చర్చ జరగడంలేదా.? జరగనివ్వడంలేదా.?

మంత్రి అంటి రాంబాబు, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సొంత సామాజిక వర్గం ‘మాకు రాజ్యాధికారం కావాలి’ అనడంపై సెటైర్లు వేశారు. ‘పిచ్చి కాపు యువత..’ అంటూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు, ‘సీఎం సీఎం.. అంటూ పవన్ కళ్యాణ్‌ని చూసి నినదించే కాపు యువత’ మీద ఆయన వేసిన సెటైర్లపై, ప్రముఖ న్యాయవాది, జనసేన సానుభూతిపరుడు కళ్యాణ్ దిలీప్ సుంకర తన ‘కామనర్ లైబ్రరీ’ అనే యూ ట్యూబ్ ఛానల్ ద్వారా స్పందించారు, ప్రస్తుత రాజకీయాల్ని విశ్లేషించారు.

ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరంజీవి మీద కాపు ముద్ర వేసి, చిరంజీవికి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే వెన్నుపోటు పొడిచిన వైనం దగ్గర్నుంచి, పవన్ కళ్యాణ్‌కి దూరంగా వుండాలంటూ కాపు సామాజిక వర్గంపై వైసీపీలోని కాపు సామాజిక వర్గ నేతలే చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేయడం వరకు.. వివిధ అంశాల గురించి మాట్లాడారు కళ్యాణ్ దిలీప్ సుంకర.

పవన్ కళ్యాణ్ విశ్వసనీయతను అంబటి రాంబాబు ప్రశ్నించడంపై కళ్యాణ్ దిలీప్ సుంకర తనదైన స్టయిల్లో విమర్శలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అంబానీనే చంపేయించాడంటూ రిలయన్స్ సంస్థలపై దాడులు చేయించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అదే అంబానీ సూచనతో ఏపీకి సంబంధించిన రాజ్యసభ సీటుని సమర్పించేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు కళ్యాణ్ దిలీప్ సుంకర.

కాంగ్రెస్ పార్టీని ఎదిరించి నిలబడ్డ ధీశాలి.. అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి వైసీపీ నేతలు చెబుతుంటారనీ, అదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థికి ఓటేసి, బెయిల్ తెచ్చుకున్నది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాదా.? అని కళ్యాణ్ దిలీప్ సుంకర ప్రశ్నించారు.

‘వీరుడెక్కడ.? శూరుడెక్కడ.? గడచిన మూడేళ్ళలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు మాట తప్పారు.? ఎన్నిసార్లు మడమ తిప్పారు.? రాజకీయ పార్టీలకు రాజకీయ వ్యూహాలుంటాయ్.. జనసేనకీ కొన్ని వ్యూహాలంటాయి. బీజేపీ తెరవెనుక అంటకాగుతున్న వైసీపీది రాజకీయమా.? జనసేనది రాజకీయం కాదా.?’ అంటూ కళ్యాణ్ దిలీప్ సుంకర, అంబటి రాంబాబుపై మండిపడ్డారు.

‘మిమ్మల్ని మీరు జంతువులతో పోల్చుకుంటున్నారు.. మీ యజమానికి బానిసలుగా వుంటున్నారు.. మీరు మళ్ళీ కాపు యువత, పవన్ కళ్యాణ్ వైపు చూడొద్దు..’ అంటున్నారు. ఏది మీ విశ్వసనీయత.? అని నిలదీశారు కళ్యాణ్ దిలీప్ సుంకర. ‘చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటివాళ్ళను చూసి కాపు యువత స్ఫూర్తి పొందుతోంది.. అందులో మేం కూడా వున్నాం.. మిమ్మల్ని చూసి ఏం స్ఫూర్తి పొందాలి.? మీ బానిసత్వమే మాకు వారసత్వమా.?’ అంటూ కళ్యాణ్ దిలీప్ సుంకర అసహనం వ్యక్తం చేశారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...