మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా కరోనా కారణంగా బ్రేక్ పడిన విషయం తెల్సిందే. సెప్టెంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు కాగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆచార్య పూర్తైన వెంటనే చిరంజీవి తన తర్వాతి ప్రాజెక్ట్ గా లూసిఫెర్ రీమేక్ ను ఎంచుకున్న విషయం తెల్సిందే.
మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ హిట్టయింది. వెంటనే రామ్ చరణ్ ఈ సినిమాపై మనసుపడి రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నాడు. సాహో ఫేమ్ సుజీత్ ను దర్శకుడిగా ఎంపిక చేసుకున్నాడు. సుజీత్ ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమాలో కీలకమైన హీరో సిస్టర్ పాత్రకు పలు హీరోయిన్ల పేర్లు వినిపించాయి కానీ ఎటువంటి అధికారిక సమాచారం లేదు. అలాగే లూసిఫెర్ రీమేక్ లో పృథ్వీరాజ్ పాత్రను ఎవరు పోషించనున్నారు అనే విషయంలో కూడా క్లారిటీ లేదు. ముందు రామ్ చరణ్ అనుకున్నారు కానీ తర్వాత కాదని తెలిసింది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో జగపతి బాబు ఎంపికైనట్లు తెలుస్తోంది. అయితే అది ఏ పాత్ర అన్నది ఇంకా తెలియలేదు.
724674 983672excellent issues altogether, you just gained a new reader. What could you recommend about your post that you produced some days in the past? Any positive? 106694