Switch to English

అవ్వాతాతల పింఛన్ల పెంపే తొలి రత్నం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

అతిరథ మహారథులు ఓ వైపు.. అశేష జనం మరోవైపు.. జై జగన్ నినాదాలు ఇంకోవైపు.. ఇవీ ఏపీ రెండో ముఖ్యమంత్రి జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కనిపించిన దృశ్యాలు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో ఘన విజయం సాధించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జగన్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను.. అని జగన్ అనగానే స్డేడియం హోరెత్తిపోయింది. తొలుత ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. తర్వాత రహస్య పరిరక్షణ ప్రమాణం చేశారు. అనంతరం గవర్నర్ నరసింహన్ అక్కడి నుంచి నిష్క్రమించారు. తర్వాత సర్వమత ప్రార్థనలు చేసి వివిధ మతాల ప్రతినిధులు కొత్త ముఖ్యమంత్రి జగన్ ను ఆశీర్వదించారు. తొలుత క్రైస్తవ మత ప్రతినిధులు జగన్ కు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ముస్లిం మతపెద్దలు ప్రార్థన చేసి, జగన్ ను ఆశీర్వదించారు. తర్వాత హిందూ మత పెద్దలు జగన్ ను ఆశీర్వదించి ప్రార్థనలు చేశారు.

అంతకుముందు ఉదయం 11.54 గంటలకు జగన్ కాన్వాయ్ తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరి 12.09 గంటలకు స్డేడియం చేరుకుంది. కాన్వాయ్ నుంచి కిందకు దిగిన జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం జగన్ ఓపెన్ టాప్ జీపులో స్టేడియం మొత్తం తిరిగి ప్రజలకు అభివాదం చేశారు. తర్వాత వేదికపైకి వెళ్లి ఆశీనులయ్యారు. 12.19 గంటలకు గవర్నర్ నరసింహన్ వేదిక వద్దకు రాగా, జగన్ ఆయనకు స్వాగతం పలికారు. తర్వాత నరసింహన్ జగన్ చేత ప్రమాణం చేయించారు. తర్వాత డీఎంకే అధినేత స్టాలిన్ మాట్లాడుతూ.. జగన్ కు అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం అని స్టాలిన్ తెలుగులో మాట్లాడంతో స్టేడియం కరతాళ ధ్వనులతో మార్మోగింది.

తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. జగన్ కు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రిగా జగన్ వయసు చిన్నదని, బాధ్యత మాత్రం పెద్దదని వ్యాఖ్యానించారు. జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఉభయ రాష్ట్రాల ప్రజలు పరస్పర సహకారంతో అభివృద్ధి దిశగా పయనించాలని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు కలసి గోదావరి జలాలను సంపూర్ణంగా వినియోగించుకోవాలన్నారు.

తర్వాత కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా వృద్ధాప్య పింఛన్లను రూ.2,250కి పెంచుతూ తొలి సంతకం చేశారు. మొదటి ఏడాది రూ2,250గా ఉన్న ఫింఛను తర్వాత ఏడాది రూ.2,500, మరుసటి ఏడాది రూ.2,750 ఆ మరుసటి ఏడాది రూ.3000కి పెంచుతానని ప్రకటించారు. అలాగే ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి గ్రామాల్లో 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని పేర్కొన్నారు. గ్రామ వాలంటీర్లుగా నెలకు రూ.5వేల వేతనంతో ఈ 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు. అవినీతి లేని పాలన అందించడమే తన ధ్యేయం అని జగన్ ఉద్ఘాటించారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగిన టెండర్లను రద్దు చేస్తానని స్పష్టంచేశారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...