ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో పొరుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మీద ప్రశంసల వర్షం కురిపించేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ‘కేసీఆర్ మీద నాకు ప్రత్యేకమైన అభిమానం అంటూ ఏమీ లేదు.. కానీ, ఆయన మంచోడు’ అంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో కలకలం సృష్టిస్తున్నాయి. ‘లంకలో పుట్టినోళ్ళంతా రాక్షసులే.. సీమాంధ్రలో పుట్టినోళ్ళంతా దోపిడీదారులే..’ అని గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని బహుశా వైఎస్ జగన్ మర్చిపోయినట్లున్నారు.
అదొక్కటే కాదు, తెలంగాణలో వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను తలపెడితే, వరంగల్ జిల్లాలో ఆయనపై రాళ్ళ దాడి జరిగింది. తెలంగాణ ద్రోహి.. అంటూ ఒకటికి వందసార్లు వైఎస్ జగన్ మీద విమర్శలు చేశారు, చేయించారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్. అయినా రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఎవరూ వుండరు కదా! అలా, పాత శతృవు బహుశా ఇప్పుడు కొత్త మిత్రుడిగా మారారని జనం అర్థం చేసుకోవాలేమో.
కేసీఆర్ ఎంత మంచి వ్యక్తి అంటే.. పోలవరం ప్రాజెక్టుకి వ్యతిరేకంగా న్యాయస్థానాలో కేసులు వేసేంత.. అని వైఎస్ జగన్, ఆంధ్రప్రదేశ్లో చెప్పి వుంటే బావుండేది. తెలంగాణలో నీటి అవసరాల కోసం తెలంగాణ రాష్ట్రం ప్రాజెక్టులు కట్టుకుంటే అది తెలంగాణకి సంబంధించిన విషయం. కానీ, ఇప్పుడు మిగులు జలాల్లో వాటా కోసం కేసీఆర్ పన్నిన పన్నాగంలో వైఎస్ జగన్ చిక్కుకుంటే, ఆంధ్రప్రదేశ్ అవసరాలకు పెను ప్రమాదం వాటిల్లుతుంది.
దురదృష్టవశాత్తూ ఆ అంశం గురించి వైఎస్ జగన్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి హోదాలో వవరణ ఇవ్వడంలేదాయె. ఇటీవలి ఎన్నికల్లో తమకు అన్ని విధాలా సహకరించిన కేసీఆర్ రుణం తీర్చుకునే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టేందుకు వైఎస్ జగన్ సాహసిస్తే, ఊరుకునే స్థితిలో ప్రజలు వుండరుగాక వుండరు. చంద్రబాబు గతంలో కేసీఆర్తో స్నేహ హస్తం కోసం ప్రయత్నిస్తే నానా యాగీ చేసిన వైఎస్ జగన్, ఇప్పుడెందుకు కేసీఆర్తో దోస్తీ కోసం వెంపర్లాడుతున్నారో ఏమో ఆయనకే తెలియాలి.
545273 695971Yay google is my world beater helped me to uncover this wonderful internet website ! . 262488