Switch to English

వారందరికీ ప్రాంతీయ బోర్డుల్లో పునరావాసం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

చాలామందికి రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన శాసనమండలిని రద్దు చేసే దిశగా ఏపీలోని వైఎస్ జగన్ సర్కారు ముందుకెళుతోంది. సోమవారం వరకు వేచిచూసి, ఆలోగా పరిణామాలు తమకు అనుకూలంగా మారకపోతే.. మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే అటు టీడీపీతోపాటు అధికార పార్టీకి కూడా నష్టమే జరగనుంది.

ప్రస్తుతం మండలిలో అధికార పార్టీకి 9 మంది సభ్యులున్నారు. మండలి రద్దైతే వారందరి పదవులు కూడా పోతాయి. పైగా రాబోయే నాలుగేళ్లలో 15 నుంచి 20 మందిని ఎమ్మెల్సీలుగా నియమించే అవకాశం వైసీపీకి వస్తుంది. ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనివారికి ఎమ్మెల్సీలుగా అవకాశమిస్తానని జగన్ పలువురికి హామీ ఇచ్చారు. మండలి లేకుంటే ఈ హామీ అమలు కాదు. అయినప్పటికీ, జగన్ మండలి రద్దుకే మొగ్గు చూపుతున్నట్టు వైసీపీ వర్గాల నుంచి తెలిసింది.

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మూడు ప్రాంతీయ అభివృద్ది బోర్డులను ఏర్పాటు చేస్తూ సర్కారు ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన బిల్లును ఇటీవలే శాసనసభ ఆమోదించింది. సీఎం జగన్ చైర్మన్ గా వ్యవహరించే బోర్డులో వైస్ చైర్మన్ తోపాటు తొమ్మిది మంది సభ్యులను నియమించే అవకాశం ఉంది. వైస్ చైర్మన్ కి కేబినెట్ హోదా కూడా ఇవ్చొచ్చు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలుగా అవకాశం కోల్పోయినవారిని ఆయా బోర్డుల్లో నియమిస్తారని చెబుతున్నారు. ఒక్కో బోర్డులో ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు సభ్యులుగా వ్యవహరిస్తారు. మిగిలిన సభ్యులను ప్రభుత్వం నియమిస్తుంది. ఇలా మండలి బదులు ప్రాంతీయ బోర్డుల్లో వారికి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మండలి రద్దుకు సైతం వెనకాడకుండా ముందుకెళ్లాలని జగన్ యోచిస్తున్నట్టు సమాచారం.

సాధ్యమైనంత వరకు టీడీపీ ఎమ్మెల్సీలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తుందని, అది కుదరని పక్షంలోనే మండలి రద్దుకు ముందుకెళ్లే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా మూడు రోజులు సమయం ఉండేలా సోమవారం సభలో దీనిపై చర్చించాలని సర్కారు నిర్ణయం తీసుకుందని పేర్కొంటున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...