Switch to English

కడప ఉక్కుకి రాజకీయ ‘తుప్పు’ వదిలేనా.?’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,442FansLike
57,764FollowersFollow

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని పరిపాలించినవారిలో ఎక్కువమంది రాయలసీమ ప్రాంతానికి చెందినవారే. అందునా, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు.. రాయలసీమ ప్రాంతానికి చెందినవారే. కడప జిల్లాకే చెందిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో కడప ఉక్కు పరిశ్రమకి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కూడా కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. తాజాగా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కూడా ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు.

వైఎస్‌ హయాంలో శంకుస్థాపన జరిగితే, ఆ తర్వాత పనులు ప్రారంభమై, పూర్తయిపోవాలి కూడా. ఎవరు అధికారంలో వున్నా కడప ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడటం ఆనవాయితీగా మారిపోయింది. పనులు మాత్రం ఇప్పటిదాకా ఎవరూ పూర్తి చేయలేదు. వైఎస్సార్‌ హయాలో కడప ఉక్కు పేరుతో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి బాగుపడ్డారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి అప్పట్లో గాలి జనార్ధన్‌రెడ్డి భారీ స్థాయిలో బహుమతులు ముట్టజెప్పారని ప్రచారం జరిగింది. అదే గాలి జనార్ధన్‌రెడ్డి, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని తన సోదరుడిగా చెబుతుంటారు. ఆ వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ సీఎం హోదాలో మళ్ళీ కొత్తగా ఉక్కు పరిశ్రమకి శంకుస్థాపన చేశారు.. మూడేళ్ళలో పూర్తి చేస్తామనీ చెబుతున్నారు.

కానీ, కేంద్రం నుంచి నిధులు ఏమైనా వస్తాయా.? ఈ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ప్రైవేటు సంస్థలేమైనా ముందుకొచ్చాయా.? అవేమీ జరగకపోతే, రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉక్కు పరిశ్రమను నిర్మించే ఆర్థిక శక్తి వుందా.? అన్న ప్రశ్నలకు మాత్రం అధికార పార్టీ నేతలు సమాధానం చెప్పడంలేదు. ‘మేం అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్ళలోనే శంకుస్థాపన చేశాం.. ఇదీ మా చిత్తశుద్ధి..’ అంటూ వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించేశారు.

శంకుస్థాపన కోసం వెచ్చించిన ఖర్చు దండగ తప్ప, ఉక్కు పరిశ్రమ వచ్చే అవకాశం లేదని కడప జిల్లా వాసులు నిట్టూరుస్తున్నారంటే, పరిస్థితి ఎంత దయనీయంగా వుందో అర్థం చేసుకోవచ్చు. విభజన చట్టంలో కడప ఉక్కు పరిశ్రమ అంశాన్ని ప్రస్తావించారు. ఆ చట్టం ప్రకారం రాష్ట్రానికి హక్కుగా ఉక్కు పరిశ్రమ దక్కాలి. కానీ, కేంద్రాన్ని ఈ విషయమై ప్రశ్నించే చిత్తశుద్ధి లేదు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి. సొంత జిల్లాలో ప్రజా వ్యతిరేకత రాకుండా వుండేందుకోసం శంకుస్థాపనని ఓ పబ్లిసిటీ ఈవెంట్‌గా మాత్రమే ఆయన చేపట్టారన్నది నిర్వివాదాంశమిక్కడ. కడప ఉక్కుకి ఈ రాజకీయ పబ్లిసిటీ తుప్పు ఎప్పుడు వదులుతుందో ఏమో.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన...

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది....

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

రాజకీయం

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

ఎక్కువ చదివినవి

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...