”విశాఖపట్నంను రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రజలు ఆహ్వానిస్తున్నారు. నిజానికి ఇది ఎన్నో ఏళ్ళ కోరిక. ఉమ్మడి రాష్ట్రంలో కూడా అప్పటి రాజధాని హైద్రాబాద్ తర్వాత అంతటి పెద్ద నగరం విశాఖ మాత్రమే. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కి విశాఖనే రాజధానిగా చేయాల్సి వుంది. కానీ, ఉత్తరాంధ్రకి వెన్నుపోటు పొడిచారు. ఇన్నాళ్ళకు విశాఖకు రాజధాని అయ్యే అవకాశం మళ్ళీ వచ్చింది. దీన్ని ఉత్తరాంధ్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారు..” అనే వాదన ప్రముఖంగా ఉత్తరాంధ్రలో కొందరు ప్రజా ప్రతినిథుల నుంచి వ్యక్తమవుతోంది.
మరీ ముఖ్యంగా అధికార పార్టీ నుంచి ఈ వాదన మరీ గట్టిగా విన్పిస్తోంది. నిజమే, ఉత్తరాంధ్రకి రాజధాని అయ్యేందుకు అన్ని అర్హతలూ వున్నాయి. అక్కడి ప్రజలూ విశాఖని రాజధానిగా కోరుకుంటున్నారు. ఏం, కడపను రాజధాని చేస్తామంటే అక్కడి ప్రజలు వద్దంటారా.? తిరుపతిని రాజధానిగా చేస్తామంటే అక్కడి ప్రజల వద్దంటారా.? దోనకొండ అయినా, నెల్లూరు అయినా, ఇంకో ప్రాంతమైనా.. రాజధాని గౌరవం దక్కుతుందంటే అక్కడి ప్రజలు వద్దనే అవకాశమే వుండదు. కానీ, రాజధాని పేరుతో అభివృద్ధి ఎంతవరకు సాధ్యం.? అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న.
రాజధాని అంటే రాష్ట్రానికి గుండెకాయ. ఓ నగరం రాజధానిగా మారితే అక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, రాజధాని ముసుగులో చాలా అక్రమాలకూ ఆస్కారం ఏర్పడుతుంది. అమరావతి రైతులే ఇందుకు నిదర్శనం. రాజధాని ప్రకటన తర్వాత అక్కడ నానా యాగీ జరిగింది. ఆ వివాదం సద్దుమణిగిందంటే, ఇప్పుడు రాజధాని మార్పు పేరుతో అక్కడ మళ్ళీ అలజడి రేగింది. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది అత్యంత దయనీయమైన పరిస్థితి. ప్రభుత్వం మారిన ప్రతిసారీ రాజధాని మారిపోతుందనే భావన జనంలోకి వెళ్ళిపోయింది. రేప్పొద్దున్న విశాఖకీ ఈ దుస్థితి పట్టదన్న గ్యారంటీ ఏముంది.? ఈ భయం ఇప్పుడిప్పుడే విశాఖ ప్రజల్లో పెరిగిపోతోంది.
అభివృద్ధి కోసం ప్రజల నుంచి భూముల్ని ప్రభుత్వం తీసుకోక తప్పదు. ఆ తీసుకునేటప్పుడు ప్రభుత్వం ఇచ్చే భరోసా, ప్రభుత్వాలు మారినా కొనసాగాలి. అమరావతిలో అది జరగడంలేదు. విశాఖలోనూ జరిగే అవకాశం లేదు. అప్పుడు మళ్ళీ రాజకీయ రచ్చ షురూ. రాజధానిపై ముఖ్యమంత్రి ఏం చెప్పినా, ప్రతిపక్ష నేత ఏం చెప్పినా.. అదంతా రాజకీయ అవసరాల నేపథ్యంలో చెప్పిన మాటలుగానే చూడాల్సి వస్తోంది. పవన్ కళ్యాణ్ సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు.
అమరావతి, విశాఖ, కర్నూలు మాత్రమే కాదు.. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా రాజకీయాలకతీతంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని గమనించాల్సి వుంది. అమరావతి, ఆంధ్రప్రదేశ్కి రాజధాని అయ్యింది. ప్రభుత్వం మారగానే, ‘మా రాజధాని ఏది.?’ అని ప్రజలు ఆవేదన చెందాల్సిన దుస్థితి దాపురించింది. మళ్ళీ ప్రభుత్వం మారాక కూడా ఇలాగే ప్రశ్నించుకునే దుస్థితి రావడాన్ని రాష్ట్ర ప్రజలెవరూ కోరుకోరు.
559832 680651Some genuinely marvellous function on behalf of the owner of this web website, utterly outstanding content. 768836
634955 442481You got a very fantastic web site, Glad I observed it by means of yahoo. 536466
370269 677094Companion, this web site will be fabolous, i merely like it 154757
585837 862055A thoughtful insight and concepts I will use on my weblog. Youve certainly spent lots of time on this. Thank you! 544903
479751 554655Numerous thanks for sharing this fine piece. Extremely intriguing tips! (as always, btw) 768323