దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలు దాటేసింది. చాలా తక్కువ సమయంలో శరవేగంగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. ‘అబ్బే, ఇంకా మూడో దశలోకి వెళ్ళలేదు..’ అని కేంద్రం చెబుతున్నా, మహారాష్ట్రలో నమోదవుతున్న కేసుల తీవ్రత చూస్తే, ప్రస్తుతం మనం మూడో దశలోనే వున్నామనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణ కాస్తమెరుగ్గా వున్నా, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కేసుల తీవ్రత కూడా ‘మూడో దశని’ తలపిస్తోన్న మాట వాస్తవం. ఢిల్లీలోనూ కరోనా పాజిటివ్ కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లోనూ పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. తమిళనాడు సంగతి సరే సరి. ఇంతకీ, లాక్డౌన్ ఎలాంటి ఫలితాలనిచ్చినట్లు.? కరోనా వైరస్ వ్యాప్తి చూస్తోంటే, లాక్డౌన్ ఫెయిల్ అన్న అభిప్రాయాలు కలగకమానవు. కానీ, లాక్డౌన్ అమలు చేయడం వల్లే కేసుల సంఖ్య 50 వేల దగ్గర వుందనీ, లేకపోతే, లక్షల సంఖ్యలో కేసులు నమోదయ్యేవని కేంద్రం చెబుతోంది.
ఆ సంగతి పక్కన పెడితే, లాక్డౌన్ సడలింపులు.. దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేసేలానే వున్నాయి కరోనా వ్యాప్తి పరంగా. మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి.. త్వరలో ప్రజా రవాణా కూడా అందుబాటులోకి వస్తుందని కేంద్రం చెబుతోంది. ఆ తర్వాత షాపింగ్ మాల్స్ వంటివీ తెరిచేయొచ్చు. విద్యా సంస్థలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాల గురించిన చర్చ జరుగుతున్న విషయం విదితమే.
దేశంలో రానున్నది వర్షాకాలం. ఈలోగా కరోనా వైరస్ని పూర్తిగా అరికట్టాల్సి వుంది. కానీ, ఆ పరిస్థితులు మాత్రం కన్పించడంలేదు. దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ఆర్థిక కార్యకలాపాల కోసం లాక్డౌన్ వెసులుబాట్లు కల్పించడం సబబే కావొచ్చు. కానీ, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే అది ఏమాత్రం సమర్థనీయం కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ‘లాక్డౌన్ ఎత్తివేయడమంటే బూడిదలో పోసిన పన్నీరులానే..’ అనే చర్చ సర్వత్రా జరుగుతోందిప్పుడు.
638911 381249Simply wanna input which you have a quite good site , I enjoy the pattern it genuinely stands out. 31440