గుజరాత్లోని రాణ్ ఆఫ్ కచ్ వద్ద పాకిస్తాన్ బోర్డర్ లోకి వెళ్లేందుకు కంచె దాటుతున్న ఒక యువకుడిని బీఎస్ఎఫ్ జవాన్లు పట్టుకున్నారు. అతడు చెప్పిన వివరాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. పోలీసులు మొదట అతడిని ఉగ్రవాదిగా భావించినా ఆ తర్వాత అతడు ప్రేమ కోసం ఈ సాహస యాత్రను చేశాడంటూ నిర్ధారణకు వచ్చారు. మహారాష్ట్రకు చెందిన ఆ యువకుడు గత కొంత కాలంగా పాకిస్తాన్ కరాచీ షా ఫైసల్ కు చెందిన అమ్మాయితో ప్రేమలో ఉన్నాడట. ఆ అమ్మాయిని కలుసుకునేందుకు ఈ సాహస యాత్ర చేసినట్లుగా చెప్పుకొచ్చాడు.
మహారాష్ట్ర నుండి దాదాపుగా 1200 కిలోమీటర్లు ప్రయాణించి తాను గుజరాత్కు చేరుకున్నట్లుగా పేర్కొన్నాడు. వాట్సప్, ఫేస్బుక్లో తామిద్దరం కూడా ఛాటింగ్ చేసుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు. మహారాష్ట్ర నుండి బైక్ పై గుజరాత్కు చేరుకున్న అతడు బోర్డర్ దాటి ప్రియురాలిని చేరాలనుకున్న సమయంలో ఇలా పట్టుబడ్డాడు. అతడి తల్లిదండ్రులు ఇప్పటికే మిస్సింగ్ కేసు పెట్టగా పోలీసులు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూడా నిర్థారించారు.
94259 100140I believe 1 of your advertisings triggered my internet browser to resize, you may well want to put that on your blacklist. 377551
156028 180700hey there, your web site is inexpensive. We do thank you for work 553945