భారత్ లో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. ప్రతిరోజూ పది వేలకు తక్కువ కాకుండా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో సామాజిక వ్యాప్తి లేదని చెబుతున్నా.. గణాంకాలు మాత్రం భయంగొలుపుతున్నాయి. గత 24 గంటల్లో 10,956 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 396 మంది చనిపోయారు. ఇప్పటివరకు ఒకేరోజు వెలుగు చూసిన కేసులు, మరణాల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. దీంతో ప్రస్తుతం దేశంలో కేసుల సంఖ్య 2,97,535 కి చేరడంతో కేసులపరంగా ప్రపంచంలో భారత్ నాలుగో స్థానంలోకి వెళ్లింది.
2.92 లక్షల కేసులతో ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న బ్రిటన్ ను భారత్ దాటేసినట్టయింది. అలాగే దేశవ్యాప్తంగా మరణాలు 8,500కి చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 76 లక్షల కేసులు నమోదు కాగా, 20 లక్షలకు పైగా కేసులతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్థానంలో 8 లక్షలకు పైగా పాజిటివ్ కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో నిలవగా.. 5 లక్షలకు పైగా కేసులతో రష్యా మూడో స్థానంలో ఉంది. మూడు లక్షల కేసులకు చేరువైన భారత్ లో ప్రతిరోజూ పది వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా లాక్ డౌన్ సడలింపుల తర్వాత ఇవి ఎక్కువయ్యాయి.
50వేల కేసులు రెట్టింపు కావడానికి 12 రోజుల సమయం పట్టగా.. లక్ష నుంచి 2 లక్షల కేసులు కావడానికి 14 రోజులు పట్టింది. ఇక లక్షన్నర కేసులు రెట్టింపు కావడానికి 17 రోజులు తీసుకుంది. ఈ పరిణామాలు సగటు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇదే రీతిలో కేసుల పరంపర కొనసాగితే త్వరలోనే రష్యాను కూడా దాటేయొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
475231 792654Keep up the fantastic piece of work, I read couple of blog posts on this web website and I believe that your web site is real fascinating and has lots of great information. 794223
629424 805680Hello! I just would like to give a huge thumbs up for the excellent information youve here on this post. I might be coming back to your weblog for more soon. 521788
267483 625599Some genuinely helpful information in there. Why not hold some sort of contest for your readers? 82317